స్వర్ణ విగ్రహానికి భద్రత.. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, జెడ్ క్యాటగిరీ ప్రొటెక్షన్.. రూ.75 కోట్ల..
ఇటీవల భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 120 కిలోల భగవత్ రామానుజాచార్యుల సమతామూర్తి స్వర్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. స్వర్ణ విగ్రహాం విలువ దాదాపు 75 కోట్ల వరకు ఉంటుంది. ముచ్చింతల్ సమతామూర్తి దర్శనానికి జనాలకు అనుమతించారు. దీంతో స్వర్ణమూర్తి విగ్రహా భద్రత ప్రశ్న తలెత్తింది. స్వర్ణమూర్తికి బుల్లెట్ ప్రూఫ్ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు జెడ్ కేటగిరి స్థాయిలో భద్రతా చర్యలు చేపడుతున్నారు.
Recommended Video

12 రోజులపాటు ఉత్సవాలు..
12 రోజుల పాటు ముచ్చింతల్లో జరిగిన రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తర్వాత కూడా ఇదే స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు చేపడుతున్నారు. విగ్రహానికి 6 నుంచి 8 అడుగుల దూరం నుంచి బుల్లెట్ప్రూఫ్ గ్లాస్ ఫ్రేమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేసేవరకు స్వర్ణమూర్తి సందర్శనకు ఎవరిని అనుమతించరు. ఈ ప్రాంతంలో 24 గంటల పాటు ఆయుధాలు ధరించిన వారు పహారా కాస్తుంటారు.

అలంకరణకే 6 కిలోల బంగారం
120 కిలోల స్వర్ణమూర్తి కావడం.. అలంకారణకు ఐదారు కిలోల బంగారు ఆభరణాలను కూడా వినియోగించారు. ప్రస్తుతం స్వర్ణమూర్తి విలువ 75 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ నిత్య కైంకర్యాలు నిర్వహించే పూజారులు మినహా మరెవరిని విగ్రహం దగ్గరకు అనుమతించారు. ఇక సమతాస్ఫూర్తి ప్రాంగణంలో 250 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఫీడ్ను పరిశీలించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

50 ఎకరాలు
50 ఎకరాల్లో విస్తరించిన ఈ క్షేత్రాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు రెండు షిఫ్టుల్లో 300 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. లోపలకు ఎంతమంది వచ్చారు, తిరిగి బయటకు ఎందరు వెళ్లారన్న వివరాలు తెలిసే ఏర్పాటు చేస్తున్నారు. స్ఫూర్తి కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఇతర బ్యాగేజీని అనుమతించకూడదని భావిస్తున్నారు. టికెట్ కౌంటర్ పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో సెల్ఫోన్లు, లగేజీ, పాదరక్షలు అప్పగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫుడ్ కోర్టు దగ్గర ఎగ్జిట్ పాయింట్ను ఏర్పాటు చేశారు. ఎంట్రీ వద్ద అప్పగించిన వస్తువులు కన్వేయర్ బెల్టు ద్వారా ఎగ్జిట్ వరకు చేరతాయి. అక్కడ వాటిని తీసుకుని బయటకు రావాల్సి ఉంటుంది.

స్కానర్లు
సమతాస్ఫూర్తి కేంద్రంలోకి వచ్చే ప్రతి వెహికల్ను స్కానర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అనుమానిత వాహనాలను ఆపేందుకు బూమ్ బారియర్స్, బొల్లార్డ్స్ను ఏర్పాటు చేశారు. ఒక వేళ వాటిని చేధించుకొని వెళ్లే వాహనాల టైర్లను చీల్చే టైర్ కిల్లర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమతాస్ఫూర్తి కేంద్రంలో గల ఆలయాల్లో నిత్య కైంకర్యాలను నిర్వహించేందుకు 250 మంది అర్చకులను నియమిస్తారు. 108 దివ్యదేశాల్లో ఇద్దరు చొప్పున, మిగతా ఆలయాల్లో మరికొందరని నియమిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇతర అవసరాలకు కలిపి మొత్తం 800 మంది సిబ్బంది ఉంటారని తెలుస్తోంది.

ఇక నిత్యం అనుమతి
సమతాస్ఫూర్తి కేంద్రానికి భక్తులను ఎల్లవేళలా అనుమతించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. పనులు పూర్తయ్యేవరకు దర్శనాలను కేవలం సాయంత్రం వేళకే పరిమితం చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఆరున్నర వరకు అనుమతిస్తారు. మరో నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల 3డీ లేజర్షో తాత్కాలికంగా నిలిపివేశారు. మందిరాన్ని దర్శించడానికి పెద్దలకు 150 రూపాయలు.. చిన్నారులకు 75 రూపాయలు ఎంట్రీ ఫీజుగా చెల్లించాలని నిర్ణయించారు. మొదట పెద్దలకు 500, చిన్నారులకు 200 రూపాయల టికెట్ ధర పెట్టాలని భావించారు. భక్తులకు భారమవుతుందని దానిని 150కి తగ్గించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications