ఏపీలో మళ్లీ చంద్రబాబే సీయం..! తెలంగాణలో కాంగ్రెస్ బతకాలన్న జగ్గారెడ్డి..!!
Recommended Video

హైదరాబాద్: సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో సంచలన వ్యాఖ్యలకు తెరతీసారు. ఆంద్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రస్థావించి తెలంగాణలో వేడిపుట్టించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ముందుచూపు ఉన్న నాయకుడు అని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి కొనియాడారు. అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు నమ్మారని, ఏపీలో వచ్చే ఎన్నికల్లో అదే జరుగుతుందన్నారు. చంద్రబాబు రెండోసారి ఏపీ సీఎం కావడం ఖాయమన్నారు జగ్గారెడ్డి.

చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ కి మంచిదని, రాష్ట్రం గాడిలో పడుతుందన్నారు. బాబు రాష్ట్ర నాయకుడు కాదు, జాతీయ స్థాయి నాయకుడని, హైదరాబాద్ లో ఐటీ విస్తరణ వెనక చంద్రబాబు ఘనత ఉందని, ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిందేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ.. తెలంగాణాలో కాంగ్రెస్ బతికితేనే ప్రజలకు శ్రేయస్కరంగా ఉంటుందన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందని, అప్పుడు హోదాను అడగని కేసీఆర్ ..ఇప్పుడు హాదా అడగడం ఏంటి ..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు మెదక్ నుండి రాహుల్ గాంధీ పోటీచేయాలని కోరుకుంటున్నానని. కేసీఆర్ పోటీచేసినా, రాహుల్ గాంధీ అత్యదిక మెజారిటీతో విజయం సాధిస్తారని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications