హైదరాబాద్లో కలకలం.. మళ్లీ చెడ్డీగ్యాంగ్ అరాచకం
హైదరాబాద్ : భాగ్యనగరంలో చెడ్డీగ్యాంగ్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. దొంగతనాలకు వచ్చి అడ్డు తిరిగిన వాళ్లను అడ్డంగా లేపేసే డేంజర్ చెడ్డీగ్యాంగ్ సభ్యులు ఇదివరకు హైదరాబాద్లో అలజడి సృష్టించారు. అయితే పోలీసులు అప్రమత్తం కావడంతో ఇటీవల వారి ఆటలు సాగడం లేదు. తాజాగా నగర శివారులో మరోసారి చెడ్డీగ్యాంగ్ రెచ్చిపోవడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్ నగర శివారు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ గ్రామంలో దొంగలు విరుచుకుపడ్డారు. ఒకే రోజు మూడు చోట్ల చోరీలు జరగడం స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది. హనుమాన్ నగర్లో ఉండే తోటపల్లి అంజిరెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టి 5 తులాల బంగారు ఆభరణాలు, 5 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం ఆ ఇంటి పక్కనే ఉన్న గుడిసెలో ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు.

అక్కడితో ఆగకుండా సత్తిరెడ్డి కాలనీలో కూడా బీభత్సం సృష్టించారు. వేద పాఠశాల ప్రధాన ద్వారం పగులగొట్టి లోనికి ప్రవేశించిన చెడ్డీగ్యాంగ్ ముఠా సభ్యులు అక్కడి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న కిశోర్ స్వామి భార్య మెడలో నుంచి 10 తులాల బంగారం, లక్షల రూపాయల నగదు చోరీ చేశారు. అయితే చెడ్డీగ్యాంగ్ ఆ రెండు ప్రాంతాల్లో రెండు మూడు గంటల పాటు రెచ్చిపోయినట్లు స్థానికులు చెబుతున్నదాన్ని బట్టి తెలుస్తోంది. దుండగులు కేవలం బనియన్లు, చెడ్డీలు మాత్రమే ధరించి వచ్చినట్లు పోలీసులకు వివరించారు. వారి చేతిలో ఇనుపరాడ్లు ఉండటంతో బాధితులు భయపడినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications