త్వరలో గుడ్ న్యూస్: కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చడంపై.. మండలిలో మంత్రి ఈటల
కరోనా వైరస్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. వైరస్ సోకిన వారి కోసం వైద్యారోగ్య శాఖ సిబ్బంది చేస్తున్న కృషిని కొనియాడారు. వారి సేవలను మాటలతో సరిపెట్టలేము అని పేర్కొన్నారు. వారు చేస్తున్న విధులకు.. ప్రభుత్వం ఎంత ఇచ్చినా తక్కువేనని స్పష్టంచేశారు. శుక్రవారం మండలిలో కరోనా పరిస్ధితులు, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై పలువురు సభ్యులు ప్రశ్నించారు. దీనికి మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు.
ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి ఈటల మరోసారి స్పష్టంచేశారు. కరోనా వైరస్ను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ వస్తుందని.. ఈ విషయంపై చర్చలు జరుపుతున్నామని ఈటల తెలిపారు. త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఎవరైనా కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.

అయితే కరోనా వైరస్ తీవ్రత అందుబాటులో ఉంది అని ఈటల పేర్కొన్నారు. కానీ కరోనా వైరస్ తీవ్రత పెరిగితే బాధితులను రక్షించడం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. దీంతో కేసుల తీవ్రత ఎక్కువగా లేదన్నారు. ఇతర రాష్ట్రాలతో చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో మరణాల శాతం తగ్గిందని ఈటల రాజేందర్ తెలిపారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications