కోటి 24 లక్షల నగదు: భారీగా పట్టుబడిన హవాలా నగదు
హవాలా నగదు భారీగా పట్టుబడింది. హైదరాబాద్లో పోలీసులు తనిఖీలు చేయగా దొరికింది. రూ.కోటి 24 లక్షల లిక్విడ్ క్యాష్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు ఉత్తరప్రదేశ్ మీరట్కు చెందిన షోయబ్ మాలిక్ డబ్బుగా గుర్తించారు. షోయబ్ ఏడు నెలల క్రితం హైదరాబాద్ వచ్చి పాత సామాను వ్యాపారం చేశాడు.
ఉత్తరప్రదేశ్లో గల తన బంధువు కామిల్ సూచించడంతో గుజరాత్ గల్లీకి చెందిన భరత్ వద్ద షోయబ్ రూ.1.24 కోట్లు తీసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు .. షోయబ్ నివాసంలో తనిఖీలు చేశారు. నగదుకు సంబంధించి లెక్క చెప్పకపోవడంతో హవాలా మార్గంలో డబ్బులు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు గుర్తించారు. రూ.1.24 కోట్ల నగదును ఆదాయపన్ను అధికారులకు అప్పగించారు.

ఇదే కాదు ఇలా పలు మార్గంలో హవాలా నగదు ట్రాన్స్ ఫర్ జరుగుతుంది. దొరికిందే మీడియాకు తెలుస్తోంది. దొరకనంత వరకు వారంతా దొరగానే సమాజంలో చెలామణి అవుతుంటారు. ఇటీవల భారీగానే హవాలా నగదు పట్టుబడుతుంది.












Click it and Unblock the Notifications