డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్పై సైబర్ దాడి - ఐదు దేశాల్లో స్తంభించిన పని
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీపై గుర్తుతెలియని దుండగులు సైబర్ దాడులకు పాల్పడ్డారు. సైబర్ అటాక్ ను గుర్తించిన వెంటనే సంస్థ అప్రమత్తమైంది. భారత్ సహా అమెరికా, రష్యా, బ్రిటన్, బ్రెజిల్ దేశాల్లో తన కార్యకలాపాలను, ఉత్పత్తుల్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.
సైబర్ దాడి నేపథ్యంలో ఇతర విభాగాలు దీని ప్రభావానికి గురికాకుండా తమ డేటా సెంటర్ సేవలను వేరు చేసినట్టు సంస్థ వెల్లడించింది. దీనిపై ఇప్పటికే వివిధ దేశాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశామని, జాగ్రత్త చర్యల్లో భాగంగా నిలిపేసిన కార్యకలాపాలను, ఉత్పత్తిని 24 గంటల తరువాత పునరుద్ధరిస్తామని సంస్థ వెల్లడించింది. తమ సంస్థపై సైబర్ దాడి జరిగిన విషయమై డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వర్గాలు స్టాక్ ఎక్చేంజ్ కు సమాచారం అందించాయి.

భారత్ నుంచి మల్టీ నేషనల్ ఫార్మా కంపెనీగా ఎదిగిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్.. ప్రస్తుతం కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి కూడా పనిచేస్తుండటం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ల ప్రయోగాలు హ్యాకింగ్ కు గురవుతోన్న సందర్భాలు వివిధ దేశాల్లో చోటుచేసుకున్న నేపథ్యంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాంబ్ పై దాడి చేసిన హ్యాకర్ల లక్ష్యం ఏమై ఉంటుందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications