మంచిరెడ్డి కిషన్ రెడ్డిని 10 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ: వివరాలు చెప్పిన ఎమ్మెల్యే
హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని రెండో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సుదీర్ఘంగా ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారన్న ఆరోపణలపై కిషన్ రెడ్డిని బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అధికారులు ఆయనను విచారించారు.
బుధవారం ఉదయం ఈడీ కార్యాలయానికి వచ్చిన కిషన్ రెడ్డిపై దాదాపు 10 గంటలపాటు అనేక అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. బ్యాంకు ఖాతాలు, విదేశీ పర్యటనలు, ఆర్థిక లావాదేవీల వివరాలను మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ అధికారులకు వివరించినట్లు సమాచారం. రాత్రి 8 గంటల సమయంలో ఆయన ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.

ఓవైపు ఢిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో ఈడీ అధికారులు వరుసపెట్టి సోదాలు నిర్వహిస్తుండగా.. తాజాగా రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేని ఈడీ విచారించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అటు ఈడీ అధికారులు గానీ, ఇటు ఎమ్మెల్యే గానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
కేసు నమోదు కాలేదని, ప్రాథమిక దర్యాప్తులో భాగంగానే ఆయనను మౌఖికంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఇందులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా అవసరమైతే ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications