వాహనదారులకు షాక్.. "ఫేక్ న్యూస్" ఎంత పని చేసిందో తెలుసా..!
హైదరాబాద్ : ఫేక్ న్యూస్ తికమక పెడుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా రాజ్యమేలుతున్నాయి. పనిపాటా లేని కొందరు చేసే ఆకతాయి వేషాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆ క్రమంలో ఇటీవల వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన ఓ మేసేజ్ తో చాలామందికి టైమ్ వేస్టయింది.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో విధించే చలాన్లకు 50 శాతం రాయితీ ఉందంటూ ఇటీవల వాట్సాప్ లో వైరల్ అయింది ఒక మేసేజ్. దీంతో ఆదివారం హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంకు చేరుకున్నారు వాహనదారులు. లోక్ అదాలత్ వేదికగా ఈ రాయితీ ఉంటుందని.. అందరూ ఈ అవకాశం వినియోగించుకోవాలనేది ఆ మేసేజ్ సారాంశం. 50 శాతం డిస్కౌంట్ అనగానే చాలామంది అట్రాక్ట్ అయ్యారు. 23వ తేదీ మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుందని అందులో పేర్కొనడంతో చాలామంది గోషామహల్ కు వచ్చారు. తీరా అది ఫేక్ న్యూస్ అని తెలిసి ఏంచేయాలో తోచక ఓ నిట్టూర్పు విడుస్తూ వెళ్లిపోయారు.

దాదాపు వారం, పదిరోజుల కిందట ఈ ఫేక్ న్యూస్ వాట్సాప్ లో బాగా వైరలయింది. అయితే అది వచ్చిన మరుసటి రోజే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దాన్ని ఖండిస్తూ అలాంటి లోక్ అదాలత్ లేదని ప్రకటించారు. అయితే ఈ ఫేక్ న్యూస్ చూసినోళ్లు మాత్రం.. పోలీసులు రిలీజ్ చేసిన మేసేజ్ చూడలేకపోయారు. దీంతో 50 శాతం రాయితీ నిజమని నమ్మారు. చూశారా.. ఒక ఫేక్ న్యూస్ ఎలాంటి సీన్ క్రియేట్ చేసిందో. సోషల్ మీడియాలో చూసిన ప్రతిదీ నిజమనుకుంటే పొరపాటే. ఇలాంటి ఫేక్ న్యూస్ పై నలుగురితో చర్చిస్తే అసలు విషయం తెలిసే అవకాశముంటుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications