తహసీల్దార్ నాగరాజుది హత్యే: జైలులో ఖైదీల మధ్య ఆత్మహత్యా?: కుటుంబీకుల ఆరోపణ -సీబీఐతో
''చంచల్గూడ జైలులో నాగరాజును ఉంచిన బ్యారెక్ లో మరో ముగ్గురు ఖైదీలు కూడా ఉన్నారు. వందల మంది ఇతర ఖైదీలు, పదుల సంఖ్యలో సిబ్బంది ఉండగా లోపల ఆత్మహత్య చేసుకోవడం ఎలా సాధ్యం? అది కూడా ఓ మొద్దు టవల్తో హ్యాంగిగ్ ఎలా చేసుకుంటారు? ఆ సమయంలో పక్కనున్న ఖైదీలు ఏం చేస్తున్నట్లు? చనిపోయినరోజు ఉదయమే ఆయన మాతో ఫోన్లో మాట్లాడారు. ఇది కచ్చితంగా ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ హత్యే అని మేం నమ్ముతున్నాం..'' అంటూ సంచలన ఆరోపణలు చేశారు దివంగత తహసీల్దార్ నాగరాజు కుటుంబీకులు.

సీబీఐ విచారణకు డిమాండ్..
ఓ భూవివాదంలో భారీస్థాయిలో రూ.1.10కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఉద్యోగం కోల్పోయి, రిమాండ్ ఖైదీగా హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో ఉన్న ఆయన.. ఈనెల 14న ఆత్మహత్యకు పాల్పడ్డారు. జైలు బ్యారెక్ లో టవల్ తో ఉరి పెట్టుకుని నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడని చెబుతోన్న పోలీసులు.. కస్టోడియల్ డెత్గా కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, నాగరాజు మృతిపై తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబీకులు.. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతు హైకోర్టులో పిటీషన్ వేస్తామని చెప్పారు.

ఇదీ అసలు వాస్తవం అంటూ..
‘‘చనిపోడానికి ముందు ఉదయం నాగరాజు మాతో ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే వచ్చేస్తున్నా.. ధైర్యంగా ఉండమని చెప్పారు. తనపై ఏసీబీ నమోదు చేసింది తప్పుడు కేసు అనడానికి మా వద్ద తగిన ఆధారాలున్నాయి. ఇప్పటికే సీసీటీవీ వీడియో ఫుటేజీలను ఏసీబీ కోర్టుకు అందజేశాం. ధర్మారెడ్డికి భూమి మ్యూటేషన్ కేసులో నాగరాజు ఏతప్పు చేయలేదు. రికార్డుల ప్రకారమే వ్యవహరించారు. ఉద్దేశ పూర్వకంగానే ఆయనను కేసులో ఇరికించారు. జైలులో ఆయన చనిపోయిన తీరుపై మాకు అనుమానాలున్నాయి. అది హత్య అయి ఉండొచ్చని మా నమ్మకం. ఈ ఘటనను హత్య కేసుగా నమోదుచేసి సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి'' అని నాగరాజు కుటుంబీకులు వ్యాఖ్యానించారు.

ఏసీబీ విచారణలో ఏం జరిగింది?
నాగరాజు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న కుటుంబీకులు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తుండగా.. కస్టోడియల్ డెత్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. నాగరాజు ఆత్మహత్యకు ముందు కొన్ని రోజులు ఏసీబీ అధికారుల కస్టడిలోని ఉన్నారు.. నాగరాజును ఏసీబీ విచారించిన అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? ఆ ముందు రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటు జైలు సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. నాగరాజు కుటుంబీకుల ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications