అక్కడ ఓకే.. మరీ ఇక్కడ.. సుమతమ్మ ఏం పాపం చేసింది: మల్లు రవి
వినాయక చవితి పర్వదినం వేళ సీఎం కేసీఆర్ బీహర్ వెళ్లిన సంగతి తెలిసిందే. గాల్వాన్ వ్యాలీ ఘర్షణ.. హైదరాబాద్ ప్రమాదంలో చనిపోయిన బీహర్ కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత మాట్లాడిన కేసీఆర్.. బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేశారు. కేసీఆర్ పర్యటనపై విపక్షాలు గుర్రుమీదున్నాయి. అయితే అందుకు మల్లు రవి ఓ కారణం కూడా చెప్పారు.
ఇతర రాష్ట్రాల ఆర్మీ కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం చేస్తున్నారు. మరీ తెలంగాణ ఆర్మీ జవాన్ల కుటుంబాల సంగతి ఏంటీ అని సీనియర్ కాంగ్రెస్ నేత మల్లు రవి ప్రశ్నించారు. బీహార్ వెళ్లి.. అక్కడి అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారని.. తెలంగాణ రాష్ట్రంలో గల కొండారెడ్డిపల్లికి చెందిన సుమతమ్మ భర్త యాదయ్య ఆర్మీ ఆఫీసర్ అని గుర్తుచేశారు. తొమ్మిదేళ్ల క్రితం డ్యూటీలో చనిపోయారని.. 5 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు.

కానీ ఇంతవరకు భూమి, ఉద్యోగం ఇవ్వలేదని మల్లు రవి వివరించారు. వారికి సాయం అందకపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని చెప్పారు. పిల్లల చదువు భారంగా మారిందని సుమతమ్మ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సుమతమ్మ కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయకుంటే కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతామని చెప్పారు. మిలటరీలో చనిపోయి ప్రభుత్వ సాయం అందని వారి వివరాలు సేకరిస్తున్నామని మల్లు రవి పేర్కొన్నారు.
ఆర్మీ కుటుంబాలకు సీఎం కేసీఆర్ చేస్తోన్న సాయం గొప్పదే.. మరీ స్థానికుల సంగతి ఏంటీ అని కాంగ్రెస్ నేతలు అడుగుతున్నారు. ఇక్కడి వారికి కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు. మరీ దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలీ.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications