టీఆర్ఎస్ కుట్రలను ఛేదించి.. కుటుంబపాలనకు అంతం: దుబ్బాక గెలుపుపై రాంమాధవ్
హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు అనూహ్య విజయం సాధించడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రఘునందన్ రావుకు పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. పలువురు నేతలు టీఆర్ఎస్ సర్కారుపై ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు.
అధికార టీఆర్ఎస్ పార్టీ కుట్రలను ఛేదించి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. టీఆర్ఎస్ కుటుంబపాలనకు టీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయమని ఈ ఎన్నిక రుజువు చేసిందని బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

దుబ్బాకలో రఘునందన్ విజయంపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ గెలుపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన మలుపు అని అన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలుపు.. టీఆర్ఎస్ పతనానికి నాంది అని వ్యాఖ్యానించారు. రఘునందన్ రావుకు అభినందనలు తెలిపారు.
దుబ్బాకలో రఘునందన్ రావు చరిత్రాత్మక విజయం సాధించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ అన్నారు. గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బును వెదజల్లిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. పోలీసులతో వేధింపులకు కూడా దిగిందని విమర్శించారు.
దుబ్బాక ప్రజలకు, బీజేపీ కార్యకర్తలు, నేతలకు ఈ సందర్భంగా రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తెలగాణ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు. కాగా, దుబ్బాక ఉపఎన్నికల్లో 1079 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందిన విషయం తెలిసిందే. రెండోస్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
Recommended Video
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications