గ్రేటర్ వార్ .. ఓల్డ్ మలక్ పేట్ లో పోలింగ్ రద్దు .. గుర్తుల తారుమారు, ఆందోళనలతో ఈసీ నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హోరాహోరీగా ప్రచారం తర్వాత జరుగుతున్న పోలింగ్ లో ఇప్పటివరకు గ్రేటర్ వాసులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు పోలింగ్ మందకొడిగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది.
Recommended Video

ఓల్డ్ మలక్ పేట్ లో ఎన్నికలను నిలిపివేసిన ఎన్నికల సంఘం
తాజాగా ఒక పార్టీ గుర్తు బదులు మరో పార్టీ సింబల్ బ్యాలెట్ పత్రాలపై అధికారులు ముద్రించడం తో ఓల్డ్ మలక్ పేట్ లో గందరగోళం నెలకొంది.
అధికారుల తప్పిదంగా పరిగణించి ఎన్నికల కమీషన్ అక్కడ పోలింగ్ నిలిపివేసింది. మళ్ళీ మరోసారి రీ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది . ఓల్డ్ మలక్ పేట్ డివిజన్లో ఏకంగా ఎన్నికల గుర్తును మార్చేసారు ఎన్నికల అధికారులు. ఓల్డ్ మలక్ పేట డివిజన్ 26 వ వార్డులో సీపీఐ అభ్యర్థి పోటీ చేస్తుండగా సిపిఎం గుర్తు ముద్రించారు. ఎన్నికల అథారిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంది .పోలింగ్ ను నిలిపివేసింది .

సీపీఐ గుర్తు కంకి కొడవలికి బదులుగా సిపిఎం ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి ముద్రించిన అధికారులు
సిపిఐ ఎన్నికల గుర్తు కంకి కొడవలి కి బదులుగా సిపిఎం ఎన్నికల గుర్తు అయిన సుత్తి కొడవలి బ్యాలెట్ లో ముద్రించారు అధికారులు. బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల గుర్తులు మారడంతో పోలింగ్ నిలిపివేయాలని సిపిఐ డిమాండ్ చేసింది.ఈ ఎన్నికలలో సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే పోటీ లో ఉంది సీపీఐ అభ్యర్థి కావడంతో , బ్యాలెట్ పత్రాలలో అధికారులు ముద్రించిన గుర్తు సిపిఎం గుర్తు కావడంతో గందరగోళం నెలకొంది.

ఎన్నికల అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి
అధికారులు గుర్తునే మార్చేసి బ్యాలెట్ పత్రాలు ముద్రించడం తో సిపిఐ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికలను నిలిపివేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఓల్డ్ మలక్పేటలో ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యం బయటపడిందన్నారు సీపీఐ నాయకులు . ఓల్డ్ మలక్ పేట్ లో ఆందోళన చేశారు . ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం వల్లే గుర్తులు మారాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మండిపడ్డారు . దీంతో తాజా పోలింగ్ రద్దు చేసిన ఎన్నికల అధికారులు మరోమారు పోలింగ్ నిర్వహించనున్నారు .
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications