హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం: తుపాకీతో బెదరించి రూ. 2 లక్షలు దోపిడీ
హైదరాబాద్: నగర శివారులో కాల్పులు కలకలం రేపాయి. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ దగ్గర ఓ వైపు యజమానిని తుపాకులతో బెదిరించిన దుండగులు.. అతని దగ్గర ఉన్న డబ్బును తీసుకుని ఉడాయించారు. మూడుచింతల మండలం ఉద్దమర్రి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
ఉద్దమర్రిలో మద్యం షాపు నిర్వహిస్తోన్న బాలకృష్ణ అనే వ్యక్తి.. రాత్రి వైన్షాపు మూసివేసి తిరిగి వెళ్తున్న సమయంలో.. దుండగులు అతనిపై దాడి చేశారు. తుపాకీతో బెదిరించారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆ తర్వాత కర్రలతో బాలకృష్ణపై దాడి చేసి.. అతని దగ్గర ఉన్న రూ. 2 లక్షలను తీసుకుని పరారయ్యారు. మంకీ క్యాప్ ధరించిన ముగ్గురు దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
బాధితుడి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేట్ బషీర్ బాగ్ ఏసీపీ రామలింగరాజు ఈ దోపిడీ ఘటనపై మాట్లాడుతూ.. మద్యం షాపు దగ్గర కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు.
Dramatic visuals: Last night at Shamirpet two residents while closing the Vinayaka wines shop, Uddamarri were attacked by gang of 3 persons wearing monkey caps armed with a gun. Robbers opened Fire and beat them up with sticks and fled away with Rs 2 lakh. #Hyderabad pic.twitter.com/dUthdh9lkx
— Sudhakar Udumula (@sudhakarudumula) January 24, 2023
మూడు రౌండ్ల కాల్పులు జరపడంతోపాటు కర్రలతో దాడి చేసి.. బాధితుడి దగ్గరున్న రూ. 2 లక్షలు ఎత్తుకెళ్లారని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాగా అనుమానిస్తున్నట్లు తెలిపారు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.