సికింద్రాబాద్ స్వప్న కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం: చిక్కుకున్న పలువురు
సికింద్రాబాద్లోని స్వప్న లోక్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్న లోక్ కాంప్లెక్స్లోని 7, 8వ అంతస్తుల్లో గురువారం రాత్రి భారీగా మంటలు ఎగిపడ్డాయి.
హైదరాబాద్: సికింద్రాబాద్లోని స్వప్న లోక్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్వప్న లోక్ కాంప్లెక్స్లోని 7, 8వ అంతస్తుల్లో గురువారం రాత్రి భారీగా మంటలు ఎగిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
స్వప్న కాంప్లెక్స్ లోపలు పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనంపైనుంచి కొందరు వ్యక్తులు తమ ఫోన్లలో లైట్ చూపిస్తూ తమను కాపాడాలంటూ కోరుతుున్నారు. ఫైర్ సిబ్బందితోపాటు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. చిక్కుకున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
Massive fire breaks out in #SwapnaLok complex in #Secunderabad pic.twitter.com/JcSdpghSAn
— Mohammed abdul akram أکرم (@maakramhyd) March 16, 2023
హైడ్రాలిక్ క్రేన్ సాయంతో భవనంలో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. మరికొందరు కూడా భవనంలో ఉన్నారని చెప్పడంతో వారిని కూడా రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రమాదం నుంచి బయటపడిన ఓ వ్యక్తి కిందికి వచ్చిన తర్వాత.. మరో ఏడుగురు భవనంలోనే చిక్కుకున్నారని.. వారికి ఆక్సిజన్ అవసరం ఉందని అధికారులకు తెలిపాడు. దీంతో ఆక్సిజన్ సిలిండర్లతో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది భవనంలోకి వెళ్లారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇప్పటి వరకు ఏడుగురిని కాపాడామని, మిగితా వారిని కాపాడుతామని చెప్పారు.
కాగా, స్వప్న కాంప్లెక్స్లో 200 షాపులు, 160కిపైగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలున్నాయి. రాత్రి సమయం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి.

మరోవైపు, మంటలు, దట్టమైన పొగతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు తెలిపారు.
Fire Accident at Swapnalok complex in secunderabad on Thursday evening. @XpressHyderabad @NewIndianXpress @madhavitata @balaexpressTNIE @Bachanjeet_TNIE pic.twitter.com/9vNKlTlG5f
— R V K Rao_TNIE (@RVKRao2) March 16, 2023
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం
జీడిమెట్లలోని కోంపల్లి ఫార్మా కంపెనీలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. కంపెనీలోని కెమికల్ డ్రమ్ములు పేలిపోతుండటంతో మరింతగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్న్యూస్ -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications