తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం .. పట్టభద్రుల చైతన్యం ఎవరికి పట్టం కడుతుందో !!
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు అనూహ్యంగా తమ ఓటు నమోదు చేశారు. గతంతో పోలిస్తే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం చీకటి పడే వరకు కూడాజరిగిన పోలింగ్ లో చిన్న చిన్న ఘటనలు మినహాయించి పోలింగ్ అంతా ప్రశాంతంగా కొనసాగింది.
మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రులు ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 64.87 శాతం పోలింగ్ నమోదు కాగా, వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 76.35 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు.

భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడంతో లెక్కల్లో రాజకీయ పార్టీలు
గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఈ పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందన్న లెక్కల్లో రాజకీయ పార్టీల నేతలు మునిగిపోయారు. ఏయే పోలింగ్ సెంటర్లో ఎంత ఓటింగ్ శాతం నమోదయింది అన్న వివరాలను తెప్పించుకొని ఏ పార్టీకి ఓట్లు పడే అవకాశాలు ఉంటాయని విశ్లేషణలు చేస్తున్నారు.
ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు, సాధారణ ఎన్నికల తరహాలో హోరాహోరీగా ప్రచారం సాగించిన అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటడం కోసం తీవ్రంగా ప్రయత్నించాయి.

ఎవరికి వారు గెలుపుపై ధీమాలో
గెలుపు తమదంటే తమదని అటు టిఆర్ఎస్ , ఇటు బిజెపి నేతలు చెప్తుండగా కాంగ్రెస్, టిడిపి తో సహా ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం పై ధీమాతో ఉన్నారు. సహజంగా సాధారణ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరిగితే అది అధికార పార్టీకి మైనస్ అవుతుందని భావిస్తారు. ఈ సారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పెరిగిన ఓటింగ్ శాతం అధికార పార్టీకి మైనస్ అవుతుందా అన్నది అందరూ తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2015 పోలింగ్ శాతంతో పోలిస్తే ఈ పోలింగ్ శాతం చాలా ఎక్కువ
పోలింగ్ సందర్భంగా చాలా మంది ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని, ప్రతిపక్ష పార్టీ ల పై దాడులు చేశారని అయినప్పటికీ పట్టభద్రులైన ఓటర్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా తమ తీర్పు ఇచ్చారని ప్రతిపక్ష పార్టీల నేతలు భావిస్తున్నారు.
గతంలో నమోదైన పోలింగ్ పర్సంటేజ్ తో పోలిస్తే ఈసారి గణనీయంగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. 2015లో జరిగిన ఎన్నికల్లో వరంగల్ స్థానంలో 53.25 శాతం పోలింగ్ నమోదు కాగా, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలలో కేవలం 39 శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది.

ఈ ఎన్నికల సమయానికి మారిన రాజకీయ పరిస్థితులు
అభ్యర్థులు ఊహించిన దానికన్నా ప్రస్తుతం పోలింగ్ దాదాపు 15 శాతం అదనంగా నమోదైనట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ శాసనమండలి స్థానం నుంచి 93 మంది, నల్గొండ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండటంతో భారీ సైజు బ్యాలెట్ పేపర్ లను , జంబో బ్యాలెట్ బాక్స్ లను ఉపయోగించి పోలింగ్ నిర్వహించారు అధికారులు. రాత్రి 7 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాలలో పోలింగ్ జరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో అనేక కీలక మార్పులు చోటు చేసుకోవడం ప్రధానంగా కనిపిస్తుంది .

పెరిగిన ఓటరు చైతన్యం .. ఎవరికి లాభం చేకూరుస్తుందో !!
రాజకీయ పార్టీలు పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించటంలో కీలక పాత్ర పోషించడం, సాధారణ ఎన్నికల తరహాలో సాగిన హోరాహోరీ ప్రచారం, ఆదివారం పోలింగ్ నిర్వహణ వంటి కారణాలు ఈసారి పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచాయి .
ఈసారి ఓటర్లలో అధికంగా చైతన్యం కనిపించడం హర్షించవలసిన అంశమే అయినప్పటికీ ఈ పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందన్నది ప్రస్తుతం సాగుతున్న చర్చ.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications