హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ ప్రాస్టిట్యూషన్ : 14వేల మంది మహిళలు, యువతులు, డ్రగ్స్
హైదరాబాద్: నగరంలో మరో భారీ సెక్స్ రాకెట్ వెలుగుచూసింది. అంతర్జాతీయ ఆన్లైన్ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీసులు. మనదేశంలోని వివిధ నగరాలకు చెందిన మహిళలు, యువతులతోపాటు విదేశాలకు చెందినవారు కూడా ఉన్నట్లు గుర్తించారు.

విటులకు మహిళలు, యువతులతో డ్రగ్స్ సరఫరా
ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. మహిళలు, యువతులకు నిర్వాహకులు ఎండీఎంఏ డ్రగ్స్ అలవాటు చేయడంతోపాటు బాధిత మహిళల ద్వారా విటులకు కూడా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తూ మత్తు దందా నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన అర్నవ్ ఈ ముఠాకు నాయకుడిగా ఉంటూ దందా కొనసాగిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.

వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా గుట్టుగా సెక్స్ రాకెట్
వెబ్సైట్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ముఠా ఉచ్చులో 14,190 మంది మహిళలు, యువతులు చిక్కుకున్నట్లు సీపీ వెల్లడించారు. వీరంతా ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, ముంబై, కోల్కతా, అస్సాం, బంగ్లాదేశ్, నేపాల్, థాయ్లాండ్, ఉజ్బెకిస్తాన్, రష్యాకు చెందిన వారని తెలిపారు. నిందితులు పలు ప్రాంతాల్లో కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

17 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, డ్రగ్స్ సీజ్
నిర్వాహకులు ఈ వ్యవహారమంతా ఆన్లైన్ లోనే నిర్వహిస్తున్నారని, ప్రధాన నిందితుడు అనుమానం రాకుండా తన ఫొటో కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు సీపీ తెలిపారు. ఈ ముఠాలోని మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 39 కేసులు నమోదు చేసి, నిందితుల వద్ద నుంచి 34 ఫోన్లు, 3 కార్లు, ల్యాప్టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. యువతులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని ఈ తరహా ముఠాల ఉచ్చులో చిక్కుకోవద్దని సీపీ సూచించారు. అనుమానం వస్తే డయల్ 100, వాట్సాప్ నెంబర్ 9490617444కు ఫిర్యాదు చేయాలని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మరోవైపు, డీసీపీ కవిత మాట్లాడుతూ.. వ్యభిచార కూపాలపై దాడులు నిర్వ హించే క్రమంలో తీగలాగితే ఈ వ్యవహారం బయటపడినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రా లకు చెందిన కొందరు నిందితులతోపాటు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెం దిన అర్నవ్ను ముఠా నాయకుడిగా గుర్తిం చినట్లు చెప్పారు. వీరిని విచారించగా అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న చీకటి తతంగం బయటపడిందని డీసీపీ కవిత వెల్లడింల్ల చారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications