Hyderabad: హైదరాబాదీలకు అలర్ట్.. మరో రెండు నెలలు చుక్కలే..!
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉన్నందున తెలంగాణలోని వివిధ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. ఇక పెద్దపల్లిలో 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. వచ్చే రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలోని జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో నేడు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ రానున్న కొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఏప్రిల్ 5న అత్యధిక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్డిపిఎస్) ప్రకారం సోమవారం హైదరాబాద్లో, ఖైరతాబాద్లో నిన్న 41.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫ్నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ముషీరాబాద్, మారేడ్పల్లి, గోల్కొండలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. హైదరాబాద్ కూడా ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం బయట తిరగొద్దని వైద్యులు సూచించారు. అత్యవసరమైతేనే మధ్యాహ్నం బయటకు వెళ్లాలని సూచించారు. ఈ ఎండకాలం వదులుగా ఉండే వస్త్రాలు ధరించాలని.. తెలుపు వస్త్రాల అయితే మంచిదని చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ కు బదులుగా దోసకాయ, పుచ్చకాయ, చెరకు రసం వంటి తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications