హైదరాబాద్ అబిడ్స్లో భారీ అగ్నిప్రమాదం... ఎగసిపడుతున్న మంటలు...
హైదరాబాద్ అబిడ్స్లో శుక్రవారం(ఫిబ్రవరి 5) రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ట్రూప్ బజార్లోని డీకే శానిటరీ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడగా... స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయతనిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
నిత్యం రద్దీగా ఉండే ట్రూప్ బజార్లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. గతేడాది నవంబర్లో అబిడ్స్ సమీపంలోని గన్ఫౌండ్రీలోనూ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. చెప్పుల దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న గోదాంతో పాటు హోటల్, దాబాకు వ్యాపించాయి. దీంతో ఆయా దుకాణాల్లో ఫర్నిచర్, సామగ్రి కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ... భారీగా ఆస్తినష్టం జరిగింది.

రెండేళ్ల క్రితం ఇదే అబిడ్స్లోని ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్ర దుకాణంలోనూ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగంతస్తుల ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్ర దుకాణం పూర్తిగా అగ్ని కీలల్లో చిక్కుకుంది. దుకాణంలోని కోట్లాది రూపాయల విలువ చేసే వస్త్రాలు కాలి బూడిదయ్యాయి. రాత్రి దుకాణం మూసివేసి దుకాణంలో సిబ్బంది వెళ్లిపోయాక ఈ ఘటన జరిగింది. మూసి వేసిన దుకాణంలో నుంచి పొగలు రావడం గమనించిన సెక్కురిటీ సిబ్బంది, స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. తొలుత మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు మిగతా మూడు అంతస్తులకు కూడా విస్తరించాయి. బట్టల దుకాణం కావడంతో ప్రమాదం తీవ్రత పెరిగి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.ఫైర్ సిబ్బంది అయిదు ఫైరింజన్ల సాయంతో మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications