హైదరాబాద్ మెట్రో ‘పార్కింగ్’ బాదుడు!
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఆ సంస్థ యాజమాన్యం భారీ షాకిచ్చింది. ఇక నుంచి వాహనాలతో వచ్చి మెట్రో స్టేషన్లో పార్కింగ్ చేసి వెళ్లాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందేనని ఎల్అండ్ టీ, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ(హెచ్ఎంఆర్ఎల్) స్పష్టం చేసింది. మొత్తం 3 కారిడార్లలో 50 స్టేషన్లు ఉండగా 40 స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంది.
వీటిలో చాలా స్టేషన్లలో ఇప్పటికే పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తుండగా నాగోల్ నుంచి మియాపూర్ కారిడార్లో చివరి స్టేషన్ల వద్ద ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. అయితే, ఇప్పుడు ఆ రెండు చివరి స్టేషన్లలో కూడా ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని ఎత్తివేసింది. దీంతో పార్కింగ్కు డబ్బులు వసూలు చేయడం పట్ల ప్రయాణికులు ఆందోళనకు దిగారు. టికెట్ ధరలు పెంచడంతో పాటు పార్కింగ్ ఫీజుతో వసూళ్లకు పాల్పడటం అన్యాయమంటూ ఎల్అండ్టీ తీరుపై మండిపడ్డారు.

ఈ ఘటనపై స్పందించిన ఎల్అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ నాగోల్, మియాపూర్ స్టేషన్లలో కూడా పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తామని తేల్చి చెప్పింది. ఆగస్టు 25 నుంచి నాగోల్ మెట్రోస్టేషన్, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్ అమలు చేస్తామని సంస్థ ప్రకటించింది. పైలట్ రన్గా బుధవారం నాగోల్ మెట్రో స్టేషన్లో పెయిడ్ పార్కింగ్ విధానాన్ని పరిశీలించామని, ప్రయాణికుల ఆందోళనతో తాత్కాలికంగా నిలిపివేసి ఆగస్టు 25 నుంచి అమలు చేస్తామని వెల్లడించింది.
నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల చింతిస్తున్నట్లు పేర్కొన్న ఎల్అండ్ టీ.. పార్కింగ్ ప్రదేశాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకే పెయిడ్ పార్కింగ్ తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్ కోసం స్పష్టమైన సూచనలు చేయడంతో పాటు 24 గంటలు సీసీ కెమెరాల నిఘా, సులభమైన పద్ధతిలో చెల్లింపు విధానాలు, బయో టాయిలెట్స్ సౌకర్యం కల్పించేందుకు పార్కింగ్ రుసుము తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం పార్కింగ్ ఫీజులను పర్మినెంట్గా డిస్ప్లే చేస్తున్నామని సంస్థ తెలిపింది. ప్రయాణికులు తమ మద్దతు, సహకారాన్ని ఎల్ అండ్ టీ మెట్రో రైలుకు అందించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, ఉప్పల్ మెట్రోలో ఉచిత పార్కింగ్ ఎత్తివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో కొంత సేపు ప్రయాణికులు, మెట్రో సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమకు ఫ్రీ పార్కింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మెట్రోరైలు టికెట్ల ధరలు పెంచి, ఇప్పుడు పార్కింగ్కు కూడా డబ్బులు వసూలు చేయడం అన్యాయమని వాపోయారు. ఇటీవలే మెట్రో టికెట్ ఛార్జీలు పెంచారని, ఇప్పుడు పార్కింగ్ ఛార్జీలు కూడా వసూలు చేస్తూ తమకు మెట్రో ప్రయాణం మరింత భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
🚨 Breaking: Nagole Metro Station has removed free parking, causing commuter outrage! Charges now range from ₹10 for 2 hours of bike parking to ₹120 for 12 hours of car parking. Payments through “Park Hyderabad” app, which is unavailable on Google Play Store.🚗#HyderabadMetro pic.twitter.com/fPDMlemMMJ
— Hyderabad Mail (@Hyderabad_Mail) August 14, 2024
ఫీజులు ఇలా..
ద్విచక్ర వాహనం కనీసం 2 గంటల సమయం వరకు పార్క్ చేస్తే రూ. 10, 8 గంటల వరకు అయితే రూ. 25, 12 గంటల వరకు అయితే రూ. 40 చెల్లించాలి.
ఇక కారు పార్క్ చేసిన 2 గంటల సమయానికి రూ. 30, 8 గంటలకు రూ. 75, 12 గంటల వరకు రూ. 120 చొప్పున ధరలు నిర్ణయించారు.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications