హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ నివాసంపై దాడి, ధ్వంసం: ఐదుగురు అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఆలిండియా మజ్లిస్ ఇ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అధికారిక నివాసంపై మంగళవారం దాడి జరిగింది. హిందూ సేనకు చెందిన సభ్యులుగా అనుమానిస్తున్న కొందరు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన ఐదుగురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
34 అశోకా రోడ్లోని అసదుద్దీన్ ఒవైసీ నివాసానికి వచ్చిన ఏడు ఎనిమిది మంది దుండగులు నివాసం ముందున్న నేమ్ ప్లేట్ను పగలగొట్టారు. విద్యుత్ దీపాలను ధ్వంసం చేశారు. కిటికీలను కూడా పగలగొట్టారు. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో అసదుద్దీన్ ఒవైసీ ఆ బంగ్లాలో లేరు.

కొందరు దుండగులు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అసదుద్దీన్ నివాసంపై ఇటుకలతో దాడి చేశారని ఆయన బంగ్లా కేర్ టేకర్ దీప మీడియాకు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కాసేపట్లోనే ఈ దాడికి పాల్పడిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకుని వారిని ప్రశ్నిస్తున్నారు. ఏ సంస్థకు చెందినవారని వారిని ప్రశ్నిస్తున్నారు.
Recommended Video
కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ చేసిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూపీలో అసదుద్దీన్ ఒవైసీ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications