అబిడ్స్ సర్కిలో కేసీఆర్ జాతీయ గీతాలాపన: పెద్ద ఎత్తున పాల్గొన్న యువత (వీడియో)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా మంగళవారం ఉదయం 11.30 గంటలకు జాతీయగీతం ఆలపించారు. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ యావత్ తెలంగాణ జాతీయ గీతం జనగణమన ఆలపించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థల్లో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. మెట్రో రైళ్లు సహా ఇతర వాహనాలను ఎక్కడికక్కడే నిలిపేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కాగా, హైదరాబాద్ నగరంలోని అబిడ్స్ జీపీవో సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరై 'జనగణమన' ఆలపించారు. కేసీఆర్ తోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో యువత, ప్రజలు పాల్గొన్నారు. కేసీఆర్ రాక సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు.
హైదరాబాద్ మెట్రో రైలు, స్టేషన్లలోనూ జాతీయ గీతాన్ని ఆలపించారు. 11.30 గంటలకు మెట్రో రైళ్లు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. ఆ తర్వాత మెట్రో రైల్లోని ప్రయాణికులు జాతీయ గీతాన్ని ఆలపించారు. కాగా, హైదరాబాద్ తోపాటు ఇతర తెలంగాణ జిల్లాలు కూడా జాతీయ గీతాలాపనతో మారుమోగాయి.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications