బాలల హక్కులనేత అచ్యుత రావు మృతి.. 8రోజులు కరోనాతో పోరాడి తుదిశ్వాస..
రోజులు గడుస్తున్న కొద్దీ కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ కాటేస్తోంది. బాలల హక్కుల ఉద్యమకారుడిగా దేశవ్యాప్త గుర్తింపు పొందిన అచ్యుత రావు బుధవారం కొవిడ్ వ్యాధి కారణంగా చనిపోయారు. కరోనా పాజిటివ్ పేషెంట్ గా హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఎనిమిది రోజుల పాటు వైరస్ తో పోరాడి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 58 ఏళ్లు. అచ్యుత రావు మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సంతాపాలు తెలిపారు.
బాలల హక్కుల సంఘం పేరుతో ఎన్జీవో స్థాపించిన అచ్యుతరావు.. గడిచిన 30 ఏళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పనిచేశారు. ఏమూలన చిన్నపిల్లలకు సమస్యలు ఎదురైనా అక్కడ ప్రత్యక్షమై సమస్యలపై పోరాడేవారు. అచ్యుతరావు సోదరుడైన ప్రముఖ కార్టూనిస్ట్ ఈనాడు శ్రీధర్ కూడా కరోనా బారినపడినా, కోలుకోగలిగారు.

బాలల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అచ్యుత రావు అంటూ హక్కుల నేత మరణం పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు చెందిన పలువురూ హక్కుల నేత మరణంపై విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో డిశ్చార్జి రేటు మెరుగ్గా ఉన్నప్పటికీ కొత్త కేసులు భారీగా నమోదవుతుండటం కలవరపెడుతున్నది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 47,705గా ఉంది. మొత్తం 429 మంది కరోనాకు బలైపోయారు.

-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications