Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్‌లో భారీ శబ్ధంతో పేలుడు: ఒకరు మృతి, తెగిపడిన చేతులు, గణేష్ నిమజ్జనమే టార్గెటా?

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ అనుమానాస్పద కవర్‌ను ఓ వ్యక్తి తెరవడంతో ఒక్కసారిగా భారీగా శబ్ధంతో పేలిపోయింది. పేలుడు ధాటికి కవర్ తెరిచిన వ్యక్తి చేతులు తెగిపడ్డాయి. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే 279 పిల్లర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గాయాలపాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Hyderabad: Suspicious blast occurred at footpath in Rajendranagar PS limits

ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరుపుతున్నారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఆధారాల కోసం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటనా స్తలికి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో చుట్టు పక్కల ప్రాంతాల వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కాగా, పేలుడు ఘటనలో మృతి చెందిన వ్యక్తిని చెత్తను సేకరించే అలీగా గుర్తించారు.

Hyderabad: Suspicious blast occurred at footpath in Rajendranagar PS limits

కాగా, శనివారం రాత్రి వినాయక నిమజ్జనం ఊరేగింపు జరిగిన సమయంలో ఈ పేలుడు సంభవించివుంటే భారీగా నష్టం జరిగి ఉండేదని భావిస్తున్నారు. అయితే, ఈ బాంబు పేలుడు ప్రణాళికను గణేష్ నిమజ్జనాన్ని లక్ష్యంగా చేసుకునే చేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+