16 ఎంపీలు గెలిస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా ఉరుక్కూంటూ వస్తది..! శంషాబాద్ సభలో కేటీఆర్.!!
రంగారెడ్డి/హైదరాబాద్: గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు నిర్మిస్తామని టీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఒక లక్ష ఎకరాలకు తగ్గకుండా వచ్చే రెండేళ్లలో కృష్ణా జలాలు ఇచ్చి రంగారెడ్డి జిల్లా ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. కృష్ణా జలాల కోసం కోసం మా రంగారెడ్డి ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడిగారన్నారు.
కాంగ్రెస్ నాయకుడు పి.కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ చేరిక సందర్భంగా శంషాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగంచారు. ఉస్మాన్ సాగర్ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. అలాగే చేవెళ్ల నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలు వస్తున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు జోగులాంబ జోన్ లో ఉన్న జిల్లాను ఛార్మినార్ జోన్ లోకి మారుస్తామన్నారు. చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ గెలవాలన్నారు.

తెలంగాణ వచ్చిన తరువాత రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందదని తెలంగాణ ఉద్యమ సమయంలో లేనిపోని ప్రచారం చేశారు. నాలుగున్నర ఏళ్లలో రంగారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు.
కేసీఆర్ నాయకత్వం మరింతగా బలపడాలంటే నాయకులు ఇచ్చిపుచ్చుకునే దోరణితో వ్యవహరించాలన్నారు. చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ సమక్షంలో చేరారు. అయినా మేము విమర్శించలేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరితే నోటికొచ్చినట్లు విమర్శించడం ఎంత వరకు సబబు అన్నారు. చేరికలు సహజమని, అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. 16 మంది పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో ఉంటే పాలమూరు రంగారెడ్డి పథకానికి నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా పరుగెత్తుకుంటూ వస్తుందన్నారు. రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్ కు 100 సీట్లకు మించి రావని, అప్పుడు ఒక్కో సీటు ఎంతో కీలకమవుతుందన్నారు. ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో టీఆర్ఎస్ పార్టీ తేలుస్తుందన్నార.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications