ఆ అంశంలో కలత చెందాను.!చలనం లేని ప్రభుత్వం.!చివరి వరకూ ఇక కాంగ్రెస్ తోనే ఉంటానన్న విజయా రెడ్డి.!
హైదరాబాద్ : అధికార గులాబీ పార్టీతో తెగతెంపులు చేసుకున్న ఖైరతాబాద్ కార్పోరేటర్, దివంగత కాంగ్రెస్ నేత పి.జనార్ధన్ రెడ్డి కూతురు విజయా రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టీపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, టీపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంతో విజయారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నగర బస్తీల్లోని ప్రతి ఇంటిలో పీజేఆర్ చిత్రపంటం ఉంటుందని, పేదల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన విశిష్ట నాయకుడు పీజేఆర్ అని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు. విజయారెడ్డిని నరగరంలో ఏ నియోజక వర్గంలో పోటీ చేయించినా సునాయాసంగా గెలుస్తుందన్నారు కోమటి రెడ్డి వెంకట రెడ్డి. ఇక పార్టీ మారిన విజయారెడ్డి గులాబీ ప్రభుత్వంపై వినూత్నంగా స్పందించారు.

ప్రభుత్వంలో స్పందన లేదు.. మహిళలు,మైనర్లపై అఘాయిత్యాలు కలచివేసాయన్న విజయారెడ్డి..
ప్రభుత్వంలో స్పందన లేదు.. మహిళలు,మైనర్లపై అఘాయిత్యాలు కలచివేసాయన్న విజయారెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ దశాదిశా లేకుండా పయనిస్తోందన్నారు ఖైరతాబాద్ మున్సిపల్ కార్పోరేటర్ విజయారెడ్డి. వ్యవస్తలన్నీ బలహీనమయ్యాయని, సామాన్య మద్యతరగతి ప్రజల జీవనం అదోగతి పాలయ్యే పరిస్దితులు నెలకొన్నాయని విజయా రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి, ప్రస్తుత పరిస్దితుల గురించి విజయా రెడ్డి వన్ ఇండియా తెలుగు తో ప్రత్యేకంగా చర్చించారు. ఇటీవల వెలుగు చూస్తున్నఅఘాయిత్యాలు సభ్యసమాజం తల దించుకునేలా ఉన్నాయన్నారు విజయా రెడ్డి.

చివరి అడుగు వరకూ కాంగ్రెస్ తోనే.. మళ్లీ పార్టీ మారబోనన్న విజయా రెడ్డి
ఇటీవల మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలు తనను కలిచివేసిందన్నారు విజయా రెడ్డి. తక్షణం స్పందించి బాదితులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు తనను దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. కార్పేరేటర్ గా తన వంతు సహాయం చేయాలని ప్రయత్నించినా ప్రోటోకాల్ పేరుతో ముందటి కాళ్లకు బంధాలు వేసేవారని ప్రభుత్వ యంత్రాంగంపై విజయారెడ్డి అసహనం వ్యక్తం చేసారు. శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయని, పట్టించుకునే నాథుడు లేడని విజయారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.

వెనుబడిన వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ మాత్రమే.. పీజేఆర్ ఆశయాలకోసం పనిచేస్తానన్న విజయ
మహిళలు, మైనర్లపై పెరుగుతున్న అఘాయిత్యాల గురించి సీఎం చంద్రశేఖర్ రావు గానీ, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గానీ పెదవి ఎందుకు విప్పడం లేదని విజయారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో కొంతమందికే న్యాయం జరుగుతుంది తప్ప అట్టడుగు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగే పరిస్దితులు లేవన్నారు విజయారెడ్డి. తన తండ్రి పీజేఆర్ బతికి ఉన్న రోజుల్లో పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే న్యాయం జరిపించేంతవరకూ పోరాడే వారని గుర్తు చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు విజయారెడ్డి.
Recommended Video


పలానా నియోజకవర్గం కావాలని అడుగను.. ప్రజల నిర్ణయం మేరకు ముందుకు వెళ్లానన్న విజయారెడ్డి
గాందీ భవన్ లో కార్యకర్తల ఉత్సాహం, ఊరేగింపు చూస్తుంటే పీజేఆర్ గుర్తుకొచ్చారనన్నారు విజయారెడ్డి. తనపై ప్రజలు, పేదవారు అనేక ఆశలు పెట్టుకున్నారని, ప్రజా నాయకుడు పీజేఆర్ బిడ్డగా ప్రజల ఆశలు నెరవేర్చేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. పదవులకోసమో,ఇతర రాజకీయ హామీలకోసమో తాను కాంగ్రెస్ లో చేరలేదని, ప్రజలకు స్వచ్చందంగా సేవ చేస్తూ పీజేఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తానన్నారు విజయా రెడ్డి. ఫలానా నియోజక వర్గం సీటు కావాలని తాను కోరుకోవడం లేదని, ప్రజలకు చేస్తున్న సేవ ద్వారా ఎక్కడ పోటీ చేయాల్సొస్తే అక్కడ పోటీ చేస్తాను గానీ డిమాండ్ చేయబోనన్నారు విజయా రెడ్డి.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications