తెలుగుతోపాటు ప్రాంతీయ భాషల్లోనూ ఆ పరీక్ష నిర్వహించండి: అమిత్ షాకు కేటీఆర్ రిక్వెస్ట్
హైదరాబాద్: ఇటీవల విడుదల చేసిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) నోటిఫికేషన్ను సవరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మొత్తం 9212 ఉద్యోగాల నియామకం కోసం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో కేవలం హిందీ, ఇంగ్లీష్లోనే పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొనగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇతర అధికారిక భాషలను కూడా ఇంట్లో చేర్చాలని ట్విట్టర్ వేదికగా కోరారు.
ఈ పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారని.. దీంతో ఇంగ్లీష్ మీడియంలో చదవనివారు, హిందీయేతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రకరకాల పరీక్షలు నిర్వహించడానికి బదులు ఒకే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ను సులభతరం చేసేలా 12 భాషల్లో నిర్వహించాలని జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ సూచించిందని.. అయినప్పటికీ ఈ నోటిఫికేషన్తోపాటు అది ఎక్కడ సరిగా అమలు కావడం లేదని పేర్కొన్నారు.

ఇది ఇలావుండగా, సీఆర్పీఎఫ్లో 9212 కానిస్టేబుల్(టెక్నికల్, ట్రేడ్స్మ్యాన్) పోస్టుల కోసం మార్చి 27 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పరీక్షకు ఏప్రిల్ 24 వరకు పురుష, స్త్రీ అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించనున్నట్లు సీఆర్పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే తెలుగుతోపాటు ప్రాంతీయ భాషల్లో పరీక్షనిర్వహించానలి కోరుతూ హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు.
Request HM @AmitShah Ji to revise the CRPF national recruitment notification to include Telugu, Tamil, Kannada, Malayalam & other official languages
— KTR (@KTRBRS) April 7, 2023
These competitive exams are being held only in English and Hindi, which is a serious disadvantage to students who did not study in… pic.twitter.com/RnmvJ87r0m
సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications