Mamatha: కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతపై బదిలీ వేటు..
హైదరాబాద్ లోని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో అభిలాష ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2010 నుంచి మమత జీహెచ్ఎంసీలోనే పనిచేస్తున్న సంగతి తెలిసిందే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నేతలతో ఉన్న సంబంధాల కారణంగా జోనల్ కమిషనర్ గా కొనసాగినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
గతంలో మమతను జూబ్లీహిల్స్ కు డిప్యూటీ కమిషనర్ గా ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే ఆమె తన పలుకుబడిని ఉపయోగించికుని 24గంటల్లో షేరిలింగంపల్లి సర్కిల్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. ఎన్నికలకు ముందు ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. 24గంటల్లో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ గా బదిలీ చేయించుకున్నారు మమత.

తాజాగా మమతపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆమెను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ గా నియమించారు.శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కూడా ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆయన స్థానంలో శబరిహను నియామకమించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications