దర్జాగా దౌర్జన్యం.!కబ్జా చేసేందుకు స్థానికుల యత్నం.!బేగంబజార్ లో ఘటన.!లబోదిబోమంటున్న యజమాని.!
హైదరాబద్: బేగంబజార్ లో ఓ షాపు స్థల వివాదం రాళ్లదాడికి కారణమైంది. మెయిన్ రోడ్డులో ఉన్న46 గజాల స్థలాన్నికభ్జాచేసేందుకు స్థానికంగా కొందరు ప్రయత్నించీ, వీలుకాకపోవడంతో పెద్దఎత్తున షాపు యజమాని ఇంటి మీదికి దాడి చేసేందుకు వచ్చారని, నగరం నడి బొడ్డులో ఈ అరాచకాలు ఏంటని బాదితులు వాపోతున్నారు. ఇంతజరుగుతున్నా రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు కంప్లైట్ కూడా తీసుకోకుండా మౌనంగా ఉండటం వెనుక కారకులెవరో చెప్పాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తమ కుటుంభానికి ప్రాణహానివుందనీ, ఏంజరిగినా పోలీసులు అధికారులే భాద్యులనీ, బేగం బజారులోని స్థానిక వ్యాపారస్తులు ఇంత దౌర్జన్యానికి పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆక్రమణకు గురైప భాదితులు సారంగ క్రుష్ణమూర్తి, వారి కుటుంభసబ్యులు ఆరోపించారు. బేగంబజార్ లోని ప్రధాన రోడ్డు మార్గంలో ఓ షాపు స్థల వివాదం ఇరు వర్గాలు రాళ్లదాడి చేసుకునేంత వరకూ వెళ్లింది.

బేగంబజారు మెయిన్ రోడ్డులో ఉన్న సర్కిల్ నెంబర్ 14 లో గల 46 గజాల స్థలాన్నికభ్జాచేసేందుకు స్థానికంగా సంజయ్ కుమార్ అనుచరులు కొందరు ప్రయత్నించారని బాధితుడు క్రుష్ణమూర్తి ఆరోపించారు. తమని అక్కడ ఉండనియ్యకుండా చేయడంతో పాటు, కబ్జాకు యత్నిస్తున్నారని, వీలుకాకపోవడంతో తమపైకి దాడికి దిగారని సారంగ కృష్ణమూర్తి ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఇటీవల మున్సీపల్ శాఖ ఆదేశాలతో పాత బిల్డింగ్ కూల్చివేయగా, కనీసం శిథిలాలను తొలగించే సమయం ఇవ్వకుండా, పక్క షాప్ లో ఉండే వీరు గొడవచేసి పెద్దఎత్తున ఇంటిమీదికి ఎటాక్ చేసేందుకు వచ్చారని బాధితులు తెలిపారు. నిర్బయంగా ఇంతటి అరాచకం బేగం బజార్ లో జరుగుతున్న రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు కంప్లైట్ కూడా తీసుకోకుండా మౌనంగా ఉండటం ఏంటని బాదితులు ప్రశ్నిస్తున్నారు.తమ కుటుంభానికి ప్రాణహానివుందనీ, తమ కుటుంబ సభ్యులకు జరగరానిది ఏంజరిగినా పోలీసులు, ప్రభుత్వ అధికారులే భాద్యత వహించాలని భాదితులు సారంగ క్రుష్ణమూర్తి, వారి కుటుంభసబ్యులు డిమాండ్ చేస్తున్నారు.













Click it and Unblock the Notifications