పెద్దలు ఒప్పుకోలేదు..! ప్రేమ ఇద్దరి ప్రాణాలు తీసింది
శంషాబాద్ : ప్రేమికులు విచక్షణ కోల్పోయారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి పాలిట మృత్యువుగా మారింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
పిల్లోనిగూడ సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఓ యువజంట విగతజీవులుగా కనిపించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా వారు ప్రేమికులుగా తేలింది.

నందిగామ మండలం పిట్టలగూడేంకు చెందిన శ్రవణ్ డిగ్రీ చదువుతున్నాడు. మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన మయూరి ఇంటర్మీడియట్ చదువుతోంది. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న శ్రవణ్, మయూరి తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారు అంగీకరించలేదనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోస్టుమార్టమ్ నిమిత్తం వారి మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications