Hyderabad: స్టీల్ వంతెన ప్రారంభ తేదీ ఖరారు: బ్రిడ్జీకి కార్మిక నేత పేరు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరో వంతెన అందుబాటులోకి రానుంది. ఇందిరాపార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని వీఎస్టీ వరకు నిర్మించిన ఉక్కు వంతెన(స్టీల్ ఫ్లైఓవర్) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. శనివారం అంటే ఆగస్టు 19న ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడం సంతోషంగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. వంతెనకు సంబంధించిన పలు ఫొటోలను పంచుకున్నారు. రూ. 450 కోట్ల వ్యయంతో 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎస్ఆర్డీపీ) కింద జీహెచ్ఎంసీ నిర్మించిందని తెలిపారు.

ఈ వంతెనకు కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాయిని.. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. అలాగే, చాలా కాలం పాటు వీఎస్టీ కార్మికుల సంఘానికి నాయిని సారథ్యం వహించారని మంత్రి కేటీఆర్ వివరించారు.
ఈ వంతెన అందుబాటులోకి రావడంతో వీఎస్టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ మార్గంలో జనావాసాలతో పాటు వాణిజ్య సంస్థలు, కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్, కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు. సమస్య నుంచి గట్టెక్కించేందుకు జీహెచ్ఎంసీ స్టీల్ వంతెన నిర్మించాలని నిర్ణయించింది. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణంతో వాహనదారుల కష్టాలకు తెరపడనుంది.
Happy to be resolving the decades old longstanding problem of traffic congestion at RTC X Roads, Ashok Nagar and VST junctions
— KTR (@KTRBRS) August 17, 2023
Will be inaugurating a new Flyover/Steel Bridge on 19th August. Built at a cost of ₹450 Crore this 2.63 KM long steel bridge was built by GHMC under… pic.twitter.com/UkDOOSvXS1
లింగంపల్లి జంక్షన్, అశోక్నగర్ క్రాస్ రోడ్ వద్ద సైతం ట్రాఫిక్ కొంత తగ్గనుందని భావిస్తున్నారు. వంతెనపై ఎల్ఈడీ లైట్లు, క్రాస్ బారియర్ల ఏర్పాటు చేశారు. ఈ వంతెనపై గంటకు 40 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంది.కాగా, దక్షిణ భారతదేశంలో రహదారిపై నిర్మించిన మొదటి పొడవైన ఉక్కువ వంతెన ఇదే కావడం గమనార్హం. జీహెచ్ఎంసీ చరిత్రలో భూసేకరణ లేకుండా నిర్మాణం పూర్తయిన బ్రిడ్జి ఇది. హైదరాబాద్లోని మెట్రో రైలు మార్గంపై నిర్మాణమైన తొలి వంతెన కూడా ఇదే కావడం గమనార్హం.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications