ఓట్ ఫర్ నోట్ కేసులో కదలిక..! వేం నరేందర్ రెడ్డికి నోటీసులు..!!
హైదరాబాద్: ఓటుకు నోటు కేసు మళ్లీ తెరమీదకు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డి ఇంటి కి ఈడీ అధికారులు తన నివాసానికి వెళ్లి నోటీసు లు అందచేశారు. ఓటు కు నోట్ కేసు లో వేం నరేందర్ రెడ్డి ఫై ఆరోపణలు ఉన్న విశయం తెలిసిందే.! వారం రోజుల్లో ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసులో సూచించారు. నరేందర్ రెడ్డి ఇంతకు ముందు టీడీపీ పార్టీ నుంచి మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిని ఓటుకు నోటు కేసులో కదలిక వచ్చినట్తు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసుతో ప్రమేయం ఉందని అనుమానం ఉన్న చాలా మందిని అవినీతి నిరోదక శాఖ విచారించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత, రేవంత్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి నోలీసులు జారీ చేసింది ఈడి. అసలు ఓటుకు నోటు కేసు కార్యరూపం దాల్చిందే వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం కోసం కావడంతో ఇప్పుడు ఆయనకు పోటీసుల జారీ సంచలనంగా మారింది. కేసులో నివ్రుత్తి కావాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని, అందుకు గాను వారం రోజుల పాటు విచారన అంసరమని ఈడీ నోటీసులో పేర్కొనడం గమనార్హం. రాబోవు వారం రోజుల్లో వీలు చూసుకుని విచారణకు హాజరు కావాల్సిందిగా వేం నరేందర్ రెడ్డిని నోటీసులో కోరారు అదికారులు.