గ్రేటర్ కౌన్సిల్ సమావేశపరచండి.. బీజేపీ నేతల డిమాండ్
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ వెంటనే సమావేశ పరచాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై గల అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ కార్పొరేటర్లతో కలిసి నేతలు ఆందోళన చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన కార్పొరేటర్లను అవమానిస్తున్నారని విమర్శించారు. ఇదీ సరికాదు అని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం,ఎన్నికల సంఘం కలిసి డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అంతేకాదు తమ కార్పొరేటర్లను కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇలా కామెంట్ చేశారు. ఒక్కో కార్పొరేటర్ రూ.5 కోట్లు ఆఫర్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే బీజేపీ నేతలు కౌన్సిల్ సమావేశ పరచాలని కోరడం విశేషం.
గ్రేటర్ మేయర్ ఎన్నిక కోసం ఎస్ఈసీ తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీనిపై న్యాయపరంగా కూడా పోరాడుతామని స్పష్టంచేశారు. ఈ అంశాన్ని తమ పార్టీకి చెందిన న్యాయ విభాగం పరిశీలిస్తున్నారని తెలిపారు. ఏ చిన్న అవకాశాన్ని తాము వదులకోబోమని వెల్లడించారు.