అల్వాల్ను మించి: రూ. 61 లక్షలు పలికిన లడ్డూ.. ఎక్కడ అంటే
తెలుగు రాష్ట్రాల్లో వినాయక లడ్డూకు మాములు క్రేజ్ లేదు. అవును లడ్డూకు వేలం భారీగా పలుకుతుంది. బాలాపూర్ లడ్డే హై రేట్ ఉంటుంది. దానిని అల్వాల్ లడ్డూ దాటేసింది. ఏకంగా రూ.46 లక్షలు పలికింది. దీంతో ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఇప్పుడు సన్ సిటీలోని రిచ్ మండ్ విల్లాలో దానిని బ్రేక్ చేసింది. లడ్డూకు లక్షల్లో ధర పలికింది. మంచి జరుగుతుందని ధైర్యం చేసి కొనుగోలు చేస్తున్నారు.
హైదరాబాద్ సన్ సిటీ రిచ్ మండ్ విల్లాస్లో గణేశ్ లడ్డూ వేలం వేశారు. రికార్డు స్థాయిలో రూ.60.80 లక్షల ధర పలికింది. ఇప్పటివరకు ఉన్న రికార్డులు అన్నీ చెదిరి పోయాయి. ఏపీ, తెలంగాణలో మరే గణేశ్ మండపం వద్ద కూడా స్వామివారి లడ్డూకు ఇంత ధర పలకలేదు. సన్ సిటీ రిచ్ మండ్ విల్లాస్లో ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లడ్డూ వేలం నిర్వహించారు.
అల్వాల్ పరిధిలోని కనాజీగూడ మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఇటీవల భారీ గణేశుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. లడ్డూ వేలం పాట కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. శనివారం జరిగిన లడ్డూ వేలం పాటలో వెంకట్ రావు అనే భక్తుడు రూ.45,99,999లకు గణేశుడి లడ్డూను దక్కించుకున్నాడు. ఆ తర్వాత రిచ్ మండ్ విల్లాలో ఒకరు అంతకుమించి వేలం పాట పాడారు.