హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌కు రూ. లక్ష జరిమానా

|
Google Oneindia TeluguNews

హోటల్ పదార్థాల్లో పరిశుభ్రత పాటించని సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ హోటల్‌పై జీహెచ్‌ఎంసీ అధికారులు లక్ష రుపాయల జరిమాన విధించారు. ఆహార పదార్థాల్లో సరైన పరిశుభ్రత పాటించకపోవడంతో పాటు నాణ్యతను లేనట్లుగా గుర్తించడంతో ఈ జరిమానాను విధించినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. కాగా హోటల్‌లో సప్లై చేసిన బిర్యాణిలో వెంట్రుకలు రావడంతో ఓ వినియోగదారుడు జీహెచ్‌ఎంసీలోని ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హోటల్‌ నిర్వాహణతో పాటు ఆహార పదార్థాల్లో నాణ్యతను పరీశీలించారు.

అయితే హోటల్లో పంపీణి చేసే ఆహార పదార్థాల్లో సరైన నాణ్యత లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో హోటల్‌పై లక్ష రుపాయల జరిమాన విధించారు. దీంతో పాటు ఇలాంటీ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో ఆహారపదార్థాల్లో నాణ్యమైన ఫుడ్‌తో పాటు పరిశుభ్రమైన ఆహారపదార్థాలను అందించాలని పేర్కోన్నారు. లేదంటే హోటల్‌కు తాళం వేస్తామని నోటీస్‌లో పేర్కోన్నారు.

Paradise Hotel has been fined Rs.one lakh for poor maintnance.

అంత్యంత క్వాలీటీగా ఉండే ప్యారడైజ్ హోటల్ కూడ ఇలాంటీ సంఘటనలు జరగడంతో వినియోగదారులు ఓకింత ఆసహనానికి గురవుతున్నారు. కనీసం ఇలాంటీ పెద్దస్థాయి హోటళ్లలోనైనా పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.

English summary
Secunderabad Paradise Hotel has been fined Rs.one lakh for poor maintnance.Officials have warned that the hotel will be closed if it is not corrected within a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X