హైదరాబాద్లో అర్ధరాత్రి రౌడీ షీటర్ దారుణ హత్య...
హైదరాబాద్లో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు అన్నాదమ్ములు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. హత్యానంతరం రౌడీ షీటర్ తల్లికి ఫోన్ చేసి చెప్పి మరీ పరారయ్యారు.
వివరాల్లోకి వెళ్తే... గౌలి గౌడ వాసిగా చెబుతున్న వినయ్ అనే వ్యక్తిపై ఛత్రినాక పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. సంతోష్,సందీప్ అనే ఇద్దరు అన్నాదమ్ముళ్లకు, వినయ్కి ఇటీవల గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ రౌడీ షీటర్లే కావడం గమనార్హం. వీరిపై కూడా రాజమండ్రి,ఛత్రినాక,సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి.

సెల్ఫోన్ గురించి వీరి మధ్య గొడవ చోటు చేసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో బుధవారం(జూన్ 24) అర్ధరాత్రి వినయ్కి ఫోన్ చేసిన సందీప్,సంతోష్.. పీ అండ్ టీ కాలనీకి రావాలని అతనికి చెప్పాడు. వినయ్ అక్కడికి వెళ్లాక సందీప్,సంతోష్ అతనితో గొడవపడ్డారు. ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో సందీప్,సంతోష్ అతని గొంతు కోసి హత్య చేశారు. అనంతరం అతని తల్లికి ఫోన్ చేసి చెప్పి మరీ అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications