హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TSRTC: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు 10 శాతం రాయితీ కల్పించిన ఆర్టీసీ

|
Google Oneindia TeluguNews

అయ్యప్ప భక్తులకు శబరిమల వెళ్లేందకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిపిస్తున్న ప్రత్యేక బస్సుల్లో భక్తులకు 10 శాతం రాయితీ కూడా ఇస్తోంది. పూర్తి వివరాలకు 24/7 కాల్ సెంటర్ - 040-23450033, 69440000 నంబర్లను సంప్రదించాలని ఆర్టీసీ కోరింది.

ఎలాంటి డిపాజిట్ లేకుండా 10 శాతం రాయితీపై సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను నడుపుతున్నారు. ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు వంట వారు, 12 సంవత్సరాలు లోబడిన మణికంఠ స్వాములు, ఒక అటెండర్ కు ఉచితంగా ప్రయాణం కల్సిస్తున్నారు. శబరిమల యాత్ర బస్సును బుకింగ్ చేసిన గురుస్వామికి కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.

RTC has given 10 percent discount to Ayyappa devotees going to Sabarimala

అయ్యప్పస్వాములు ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణలో తాము కోరుకున్న ప్రదేశం నుంచ దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాల వరకు నడుస్తోన్నాయి. తాజాగా ఆర్టీసీ తన ఫేస్ బుక్ లో అయ్యప్ప భక్తుల ఫీడ్ బ్యాక్ ను పోస్ట్ చేసింది.

కాగా తెలంగాణ ఆర్టీసీ ఈ మధ్యే ఓ పాట విడుదల చేసింది. ఈ పాటను రామ్ మిర్యాల పాడారు. ఈ పాటలో ఆర్టీసీ గొప్పతనాన్ని వివరించారు. ఈ పాటను ఆర్టీసీ మన బస్సు యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.

English summary
RTC runs special buses for Ayyappa devotees to go to Sabarimala. TS RTC is also giving 10 percent discount to devotees in special buses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X