అధిక ధరలకు మద్యం అమ్మితే... కఠిన చర్యలు
తెలంగాణలో అతిపెద్ద పండగా దసరా . ఈ సంధర్భంలో ఎక్కువ మొత్తం మద్యం అమ్మకాలు జరుగుతాయి. దసరా పండగ వచ్చిందంటే మద్యం వ్యాపారుల సేల్ రెట్టింపు అవుతోంది. అయితే అదే సమయంలో మద్యం కొరత కూడ ఉంటుంది. దీంతో మద్యం వ్యాపారులు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగానే మద్యం ధరలను తమకు ఇష్టం వచ్చినట్టు పెంచి అమ్ముతారు. కృత్రిమ కొరత సృష్టించి మద్యం రేట్లను డబుల్ చేస్తారు.అయితే ఇలాంటీ అమ్మకాలు జరగకుండా తెలంగాణ ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.
అ నేపథ్యంలోనే ఎక్కువ ధరలకు మద్యం అమ్మె వ్యాపారుకు సీరీయస్గా హెచ్చరించింది. ఎమ్మార్పీకంటే ఎక్కువ ధరలకు అమ్మిన వారికి 2 లక్షల రుపాయల జరిమానాను విధించడంతో పాటు వారం రోజుల పాటు వైన్షాపుల లైసెన్స్లను సస్పెండ్ చేస్తామని తెలంగాణ వైన్షాపుల యాజమానులను హెచ్చరించింది. ఇలా గత రెండు రోజులుగా ఎక్కువ ధరలకు అమ్మిన ఎనిమిది వైన్షాపులను పలు జిల్లాల్లో గుర్తించిన ప్రత్యేక టీంలు గుర్తించి పట్టుకున్నాయి. వీరిపై చర్యలు తీసుకునేందుకు సిద్దం అవుతున్నాయి.
ఈనేపథ్యంలోనే పండగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు ఏ వైన్ షాపు యాజమాని ప్రయత్నించినా చర్యలు తప్పవని ఎక్సైజ్శాఖ స్పష్టం చేసింది.ఎక్సైజ్ స్టేషన్లకు అదనంగా స్టేట్ టాస్క్ఫోర్స్ టీంలు నాలుగు, ఎన్ఫోర్స్మెంట్ టీంలు పది, డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ టీంలు 34 ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఎమ్మార్పీకి మించి ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తే సంబంధిత ఫోన్ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు.
స్టేట్
కంట్రోల్
రూం
040--24733056
హైదరాబాద్
040--24746884
రంగారెడ్డి
040-24600450