ఏడో నిజాం కూతురు బషీరున్నీసాబేగం కన్నుమూత
హైదరాబాద్: ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కూతురు సాహెబ్జాదీ బషీరున్నీసాబేగం(93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ పురానీహవేలీ నిజాం మ్యూజియం ఆవరణలోని ఉస్మాన్ కాటేజ్ భవనంలో తుదిశ్వాస విడిచారు.
బషీరున్నీసాబేగం భౌతిక కాయాన్ని పురానీహవేలీ సమీప మసీదుకు తరలించి జనాజా నమాజ్ నిర్వహించారు. నిజాం మనవడు నవాబ్ నజాఫ్ అలీఖాన్, మ్యూజియం డైరెక్టర్ ఱఫత్ హుస్సేన్ బేగం, క్యూరేటర్ అహ్మద్ అలీ, నిజాం కుటుంబసభ్యులు, వారి సన్నిహితులు సంతాపం వ్యక్తం చేశారు.

కాగా, ఏడో నిజాంకు 21 సంవత్సరాల వయస్సులో 1906 ఏప్రిల్ 14న ఆజం ఉన్నీసాబేగంతో వివాహమైంది. ఆయనకు మొత్తం 34 మంది సంతానం. ఏడో నిజాం సంతానంలో ఇప్పటి వరకు జీవించి ఉన్నది ఆమె ఒక్కరే. బషీరున్నీసాబేగం 1927లో జన్మించారు.
దక్కన్ హైదరాబాదీ సంస్కృతిని ప్రతిబింబించేలా నగలు ధరించేవారు. ఈమె భర్త నవాబ్ ఖాజీంయార్ జంగ్ చాలా కాలం క్రితమే మరణించారు. ఆమెకు ఒక కుమార్తె షహెబ్ జాదీ రషీదున్నీసా బేగం, కుమారుడు ఉన్నారు. కుమారుడు సుమారు పాతికేళ్ల క్రితం తప్పిపోయారు. ఇప్పటి వరకు అతని ఆచూకీ లభించలేదు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications