షాకింగ్ ...రెండో సారి అదే రిపీట్.... కేసీఆర్ క్యాబినెట్ లో మరో ఫిరాయింపు ఎమ్మెల్యే?
సండ్ర వెంకటవీరయ్య... తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్న ఎమ్మెల్యే. టిడిపి నుండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే గా గెలిచిన సండ్ర వెంకటవీరయ్య గత కొంతకాలంగా పార్టీ మారుతారు అనే ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ ఫిబ్రవరి 19న మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్న తరుణంలో సండ్ర వెంకటవీరయ్య టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అందుకే టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించిన చంద్రబాబు సండ్ర వెంకటవీరయ్యను టీటీడీ బోర్డు మెంబర్ గా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

గతంలో తలసాని ... తాజాగా సండ్ర... ఫిరాయింపు నేతలకు మంత్రివర్గంలో స్థానం
ఈనెల 19న క్యాబినెట్ విస్తరణ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విస్తరణలో పదిమందికి స్థానం దక్కే అవకాశం ఉంది. అయితే ఆ పదిమందిలో ఫిరాయింపు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కేబినెట్లో సైతం ఫిరాయింపు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి కట్టబెట్టిన కెసిఆర్ ఈ దఫా కేబినెట్లో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యే సండ్ర కు అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. సండ్ర వెంకటవీరయ్య పార్టీ మారడానికి మంత్రి పదవి ఆఫర్ చేసిన నేపథ్యంలో 19న జరగనున్న మంత్రివర్గ విస్తరణలో సండ్ర కు స్థానం దక్కనుంది అని టాక్ వినిపిస్తోంది.

సండ్ర టీటీడీ బోర్డు మెంబర్ గా ప్రమాణ స్వీకారం చెయ్యనిది అందుకే
గత ఎన్నికల్లో టిడిపి నుండి విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం ఇచ్చినప్పటికీ బోర్డు మెంబర్ గా ప్రమాణస్వీకారం చేయలేదు. టిఆర్ఎస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్న కారణంగానే ఆయన బోర్డు మెంబర్ గా ప్రమాణస్వీకారం చేయలేదని తెలుస్తోంది. ఎప్పుడైతే సండ్ర వెంకటవీరయ్య టిఆర్ఎస్ లో చేరతారని, మంత్రిగా అవకాశం కూడా దక్కనుందని తెలిసిందో వెంటనే టిటిడి బోర్డు మెంబర్ గా సండ్ర పదవిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్యాబినెట్ లో చోటు ..అసహనంలో టీఆర్ఎస్ ఆశావహులు
ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ లోని చాలా కాలంగా మంత్రి పదవి కోసం ఆశావహులు ఎదురు చూస్తూ ఉంటే గత కేబినెట్లో సీఎం కేసీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అవకాశమిచ్చారు. దీంతో గత కేబినెట్లో అవకాశం రాని వారు చాలా మంది ఈసారైనా తమకు అవకాశం వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఫిరాయింపు ఎమ్మెల్యే సండ్ర కు స్థానం కల్పిస్తారు అని తెలియడంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు అమరావతికి పయనమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పై చంద్రబాబు నాయుడుతో రేపు జరగనున్న పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చించనున్నారు. సండ్ర వెంకటవీరయ్య పార్టీ మార్పుపై ప్రధానంగా చర్చ జరగనుంది. కేసీఆర్ క్యాబినెట్ లో సండ్రకు స్థానం పక్కా అని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.
లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో కాకుండా ముందుగానే సండ్రకు క్యాబినెట్ లో బెర్త్ కన్ఫార్మ్ చెయ్యటంతోనే సండ్ర కారెక్కేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం .
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications