ప్రారంభమైన పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ..! ఎక్కడి సమస్యలు అక్కడే..!!
Recommended Video

హైదరాబాద్: పంచాయతీ హడావిడి మొదలైంది. గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇవాళ్టి నుండి నామినేషన్ లు స్వీకరణ ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 9వ తేదీ కాగా 10 వ తేదీన నామినేషన్ ల స్క్రూటిని చేస్తారు. 13 వ తేదీ వరకు నామినేషన్ ల ఉపసంహరణ, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీ లో ఉన్న అభ్యర్థుల ప్రకటన చేస్తారు.
21 న ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ జరిపి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి అనంతరం పలితాలు ప్రకటిస్తారు. ఐతే పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం సరిగా లేనట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలపై ఇప్పటికే బీసి సంఘం నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా తాజగా ఉపాద్యాయ సంఘాలు కూడా ఎన్నికల నిర్వహణ తేదీలపైన అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి.

సరిగ్గా ఘణతంత్ర దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగేలా ఎన్నికల తేదీలు ఉన్నాయని వాటిని సవరించాలని ఉద్యోగ ఉపాద్యాయ సంఘాలు కోరుతున్నాయి గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను సవరించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25వ తేదీన రెండో దశ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మెజారిటీ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉండటం, స్కూళ్లలో పోలింగ్ నిర్వహించడంతో జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆటంకం కలుగుతుందని టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘునందన్, ఎస్జీటీ ఫోరం అధ్యక్షుడు కమ్రొద్దీన్ తెలిపారు.












Click it and Unblock the Notifications