ఎల్లుండి బీహర్కు సీఎం కేసీఆర్.. నితీశ్తో భేటీ..
ఇటీవల సీఎం కేసీఆర్ కూడా బిజీగా ఉంటున్నారు. సమయం దొరికితే చాలు.. జాతీయ రాజకీయాలు, విపక్షాలను ఎండగడుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ.. సీఎంలు/ ప్రాంతీయ పార్టీ అధినేతలను కలుస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీయే వ్యతిరేక పక్షాలను కూడగట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కోవాలని భావిస్తున్నారు.
జాతీయ రాజకీయాల కార్యాచరణలో భాగంగా ఈ నెల 31వ తేదీన బీహార్ సీఎం నితీశ్ కుమార్తో సమావేశం కానున్నారు. పాట్నాలో నితీశ్ కుమార్తో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారని తెలుస్తోంది. ఆ క్రమంలో నేషనల్ పాలిటిక్స్ గురించి చర్చిస్తారు. చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరులైన భారత జవాన్ల కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ కలుస్తారు.

అమర జవాన్లకు గతంలో తెలంగాణ ప్రభుత్వం గతంలో ఆర్థికసాయం ప్రకటంచిన సంగతి తెలిసిందే. ఆ సాయాన్ని ఈ పర్యటనలో భాగంగా అందిస్తారు. దీంతోపాటు సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగింది. 12 మంది బీహార్ వలస కూలీలు చనిపోయారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్తో కలిసి ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను అందిస్తారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications