Disha murder: దిశ ఘటన నిందితులు నా నుండి తప్పించుకోలేరన్న రాజా సింగ్ ..కేసు నమోదు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాద్ నగర్ లో జరిగిన "దిశ" అత్యాచారం, హత్య ఇంకా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన నలుగురు నిందితులను వెంటనే ఉరి తీయాలంటూ దేశ వ్యాప్తంగా డిమాండ్ వస్తున్న తరుణంలో రాజా సింగ్ కూడా దిశ అత్యాచారం, హత్య కేసు నేరస్తులకు మరణమే సరైన శిక్ష అని పేర్కొన్నారు.
ఇక ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలను చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దిశ అత్యాచారం, హత్య కేసు గురించి మాట్లాడిన ఎమ్మెల్యే రాజాసింగ్ దిశ ఘటనలోని నిందితులు ఒకవేళ కోర్టు నుంచి తప్పించుకున్నా లేక జైలు నుంచి తప్పించుకున్నా తన నుంచి మాత్రం తప్పించుకోలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశను ఏ విధంగా అయితే దారుణంగా హత్య చేశారో నిందితులైన ఆ నలుగురికి కూడా అదే శిక్ష పడుతుందన్నారు.

మహమ్మద్ పేరును ప్రస్తావిస్తూ, ఓల్డ్ సిటీ ముస్లిం ల గురించి మాట్లాడడంతో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బర్కత్ పుర పోలీస్ స్టేషన్లో పోలీసులు రాజాసింగ్పై కేసు నమోదు చేశారు. అయితే తాను ఇలాంటి కేసులకు భయపడను అని ,తనపై కేసు నమోదు చేసే ముందు పోలీసులు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications