Hyderabad: మూడేళ్ల తర్వాత విమాన టికెట్ డబ్బు రీఫండ్..!
టికెట్లు బుక్ చేసుకుని విమాన కొవిడ్-19 ప్రయాణం చేయలేకపోయిన ముగ్గురికి డబ్బు రీఫండ్ చేయాలని విమానయాన సంస్థను వినియోగదారుల ఫోరం ఆదేశించింది. విమాన టిక్కెట్ల రీఫండ్ మొత్తాన్ని ముగ్గురు ప్రయాణికులకు చెల్లించాలని హైదరాబాద్లోని వినియోగదారుల న్యాయస్థానం ఎతిహాద్ ఎయిర్వేస్ని ఆదేశించింది.
జనవరి 2020లో ముగ్గురు ప్రయాణికులు ఎతిహాద్ విమానంలో హైదరాబాద్ నుంచి అబుదాబి మీదుగా అమెరికాలోని చికాగో, వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. వారు ఏప్రిల్ లో వెళ్లేందుకు జనవరిలో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే దేశంలో COVID-19 కేసుల పరిమితుల మధ్య అన్ని విమానాలు రద్దు అయ్యాయి.ఆంక్షలు సడలించినప్పుడు ముగ్గురిలో ఒకరు ఆగస్టులో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. మార్చి 2022లో ఫిర్యాదుదారు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఎతిహాద్ కస్టమర్ కేర్ను మళ్లీ సంప్రదించడానికి ప్రయత్నించారు.

అయితే హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే విమానంలో సీట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణం చేయలేకపోయారు. ఫిర్యాదుదారులు ప్రయాణం కోసం వేరే విమానయాన సంస్థ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి వచ్చింది. అనేక ఫిర్యాదులు చేసినా, ఎతిహాద్ కస్టమర్ కేర్ను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ, వారు సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ప్రయాణికులు లీగల్ నోటీసు పంపారు. నోటిసుల్లో అక్టోబరు 19, 2022న, ఎయిర్లైన్ సీట్ లభ్యతకు లోబడి ప్రాధాన్య తేదీలలో రీఫండ్ లేదా రీబుకింగ్ని ఉచితంగా అనుమతించమని కోరారు.
హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లే విమాన టిక్కెట్ల ధరతో సహా రూ. 45,00,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినప్పటికీ తక్కువే రీఫండ్ చేశారు. దీంతో ముగ్గురు ప్రయాణికులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. అయితే, విమాన టిక్కెట్ల మొత్తం ధర రూ. 5,45,738, ఏడు నెలల కారణంగా, అక్టోబర్ 19, 2022 నుంచి జూన్ 9, 2023 వరకు సంవత్సరానికి 9 శాతం వడ్డీని చెల్లించాలని ఎతిహాద్కు వినియోగదారుల ఫోరం ఆదేశించింది.












Click it and Unblock the Notifications