ఫోన్ చేయాలన్నా భయపడే పరిస్థితి, కేటీఆర్ యూటర్న్!: తెలంగాణలో చంద్రబాబు కీలకవ్యాఖ్యలు
Recommended Video

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎడిటర్స్ మీటింగ్కు వచ్చిన సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. అయిదు రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దేశంలో ఎవరికి కూడా స్వేచ్ఛ లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ చేశారని ఆరోపించారు.
కనీసం ఫోన్ చేయడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరినీ భయపెట్టి లొంగదీసుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. దీనిని తట్టుకోలేక తాము (తెలుగు దేశం) ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే వ్యతిరేక కూటమికి తాము పునాదులు వేశామని చెప్పారు.

ఎవరేమన్నా.. హైదరాబాద్ కోసం కృషి చేసింది నేనే
తెలంగాణ రాజధాని హైదరాబాద్, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలు అన్నదమ్ముల్లాంటివని తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి చెప్పారు. అమరావతి రాజధానిగా రూపుదిద్దుకోవాలని చెప్పారు. హైదరాబాద్ నగరం మరింత ఎదగాలని చెప్పారు. ఎవరు ఏమి అనుకున్న తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ కోసం కృషి చేసింది తానే అన్నారు.

అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ గ్రేట్
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ గ్రేట్ అని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులకు తాను అడ్డుపడ్డానని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ సిటీ, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు, దేవాదులతో పాటు మిగిలిన ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది నేను కాదా అని ప్రశ్నించారు.

ప్రధాని కబంధ హస్తాల నుంచి దేశాన్ని రక్షించాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కబంధ హస్తాల నుంచి దేశాన్ని రక్షించడమే తమ ఏకైక లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. నాలుగున్నర సంవత్సరాలలో దేశంలో ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా అని ప్రశ్నించారు. భారతదేశంలో ఇప్పుడు రెండే రాజకీయ వర్గాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ఒకటి ఎన్డీయే అనుకూల, రెండు ఎన్డీయే వ్యతిరేక కూటమి అన్నారు. కాంగ్రెస్ పార్టీతో భావసారూప్యత లేకపోయినా దేశాన్ని రక్షించడం కోసం ఆ పార్టీతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు.

భవిష్యత్తులో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది
ఆ తర్వాత శేరిలింగంపల్లిలో నిర్వహించిన రోడ్డు షోలో చంద్రబాబు మాట్లాడారు. భవిష్యత్తులో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బీజేపీ, తెరాస రెండూ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. దేశ ప్రయోజనాల కోసం తాము కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపామని చెప్పారు. తనను తిడుతూ కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అన్ని అభివృద్ధి పనులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.

తెరాస ఇల్లు కట్టిస్తుందనే నమ్మకం లేదు
తెరాస పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని చంద్రబాబు అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు కలిసి దొంగాట ఆడుతున్నాయని చెప్పారు. తనను విమర్శించి పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తులో తెరాస ఇల్లు కట్టిస్తుందనే నమ్మకం ఏమాత్రం లేదని చెప్పారు. కేసీఆర్ ఏ ఫ్రంట్లో ఉంటాడో తేల్చుకోవాలన్నారు. హైదరాబాద్, చార్మినార్లను తాను కట్టలేదని, అలా చెప్పలేదని అన్నారు. టీడీపీ చొరవతో హైదరాబాదులో లక్షలాది ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. గతంలో తాను హైదరాబాదును అభివృద్ధి చేశానని కేటీఆర్ చెప్పారని, ఇప్పుడు తనపై విమర్శలు చేయడం ఏమిటన్నారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications