లెక్క తేలని క్రికెట్ మ్యాచ్ టికెట్లు చాలా ఉన్నాయి!!
భారత-ఆస్ట్రేలియా మధ్య చివరి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో చివరి మ్యాచ్పై ఉత్కంఠ పెరిగింది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత బీసీసీఐ మ్యాచ్ను హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు కేటాయించింది. కరోనా నేపథ్యంలో స్టేడియంలో నిర్వహణ లేదు. మ్యాచ్కు అనువైనదిగా లేదని హెచ్సీఏనే చెబుతోంది. అలాంటప్పుడు మ్యాచ్ నిర్వహించేందుకు ఎందుకు ఒప్పుకున్నారన్న ప్రశ్నకు సమాధానం లేదు.
టికెట్ల కోసం వేలమంది తెల్లవారుజాము నుంచే లైనులో నిలబడినప్పటికీ కేవలం 2వేల టికెట్లు అమ్మి చేతులు దులుపుకున్నారు. తొక్కిసలాట జరిగి ఎంతోమంది అభిమానులు గాయపడ్డారు. వారికి క్రికెట్ మీద ఉన్న ప్రేమను పెద్దలు మరోవిధంగా ఉపయోగించుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభానికి పెద్దగా సమయం లేకపోయినప్పటికీ 13 వేల టికెట్లకు లెక్క తేలలేదు.

స్టేడియం కెపాసిటీ మొత్తం 55వేలు కాగా 34వేలమందిని అనుమతిస్తారు. ఇందులో ఆటగాళ్లకు, స్పాన్సర్లకు 4500 టికెట్లు కేటాయించారు. అవి పోను 29,500 టికెట్లు అమ్మకానికి ఉంచారు. అయితే టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నారని, ఇందులో 40 కోట్ల స్కాం జరిగిందని తెలంగాణ క్రికెట్ సంఘం నేత గురవారెడ్డి ఆరోపించారు. రూ.1500 టికెట్ ను బ్లాక్లో రూ.5వేల నుంచి రూ.10వేలకు అమ్ముతున్నట్లు సమాచారం.
స్టేడియం నిర్వహణ సరిగా లేకపోవడంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేదా? అనే అనుమానం క్రికెట్ ప్రేమికుల్లో కలుగుతోంది. టికెట్ల అమ్మకాలు తమ చేతిలో లేవని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ ప్రకటించారు. ఆన్ లైన్ లో ఎన్ని టికెట్లు అమ్మాం.. ఆఫ్ లైన్ లో ఎన్ని టికెట్లు అమ్మామనేది ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. టికెట్ అమ్మకాలు బీసీసీఐ చూసుకుంటుందని చెప్పిన అజారుద్దీన్ తర్వాత నివేదిక రూపంలో ప్రభుత్వానికి చెబుతానమనడంపై క్రికెట్ ప్రేమికులంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications