20 మందితో టీఆర్ఎస్ రెండో జాబితా.. గెలుపు గుర్రాలు వీరే.. మరో 25 డివిజన్లు..
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. నిన్న 105 మంది అభ్యర్థులతో కలిసి జాబితా రూపొందించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో 20 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. బల్దియాలో 150 డివిజన్లు ఉన్న సంగతి తెలిసిందే. రెండు విడతల్లో 125 మంది క్యాండెట్ల పేర్లను ప్రకటించి.. గ్రేటర్ పోరులో ముందు ఉంది. మరో 25 మంది అభ్యర్థులను ప్రకటిస్తే మొత్తం డివిజన్లకు క్యాండెట్ల పేర్లను వెల్లడించినట్టు అవుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కన్నా.. అధికార టీఆర్ఎస్ ముందంజలో ఉంది.
వీరే అభ్యర్థులు..
మల్లాపూర్- దేవేందర్రెడ్డి, రామాంతపూర్- జోత్స్న, బేగంబజార్- పూజా వ్యాస్ బిలాల్, సులేమాన్ నగర్- సరితా మహేష్, శాస్త్రిపురం- రాజేష్యాదవ్, రాజేంద్రనగర్- శ్రీలత, హిమాయత్నగర్- హేమలత యాదవ్, బాగ్అంబర్పేట- పద్మావతి రెడ్డి, భోలక్పూర్- నవీన్కుమార్, షేక్పేట్- సత్యనారాయణ యాదవ్, శేరిలింగంపల్లి- రాగం నాగేందర్, అడ్డగుట్ట- ప్రసన్న లక్ష్మి, మెట్టుగూడ- రాసూరి సునీత, బౌద్ధనగర్- కంది శైలజ, బేగంపేట్- మహేశ్వరి శ్రీహరి, వివేకానందనగర్ కాలనీ- రోజా రంగారావు, వినాయక్నగర్- బద్ధం పుష్పలతరెడ్డి, బాలానగర్- రవీందర్రెడ్డి, కూకట్పల్లి- సత్యనారాయణ జూపల్లి, మైలార్దేవ్పల్లి- ప్రేమ్దాస్ గౌడ్ పేర్లను ప్రకటించింది.

కౌన్ బనేగా..
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మరీ ప్రజలు ఏ వైపు నిలుస్తారో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications