సజ్జనార్.. నిమజ్జనోత్సవంలో సంథింగ్ స్పెషల్ : వినాయకుడి విగ్రహంతో ఇలా..!!
సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్. ఆయనకు డిపార్ట్ మెంట్ లోనే కాదు..కామన్ పబ్లిక్ లోనూ ప్రత్యేక గుర్తింపు. ఎక్కడ ఉన్న తన ప్రత్యేకతను చాటుకుంటారు. ఈ రోజు హైదరాబాద్ లో గణేష్ నిజమజ్జనోత్సవం జరుగుతోంది. సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా కొనసాగతున్నారు. సాధారణ ప్రయాణీకుడిగా రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తోటి ప్రయాణీకుల సమస్యలు తెలుసుకొనే ప్రయత్నం చేసారు. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసే ఎంజీబీఎస్ లో తనిఖీలు నిర్వహించారు.
బస్సులపై అశ్లీల పోస్టర్లు ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. సంస్థను లాభాల బాటలో పట్టించేందుకు కృషి చేస్తున్నారు. ఇలా ఏ రంగంలో ఉన్నా ఆయన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి అందరి చూపునూ తన వైపు తిప్పుకొన్నారు. నిమజ్జనం సందర్భంగా వినాయకుడిని ఆర్టీసీ బస్సులో నిమజ్జనానికి తీసుకెళ్లి అందరి దృష్టినీ ఆకర్షించారు. బస్సులో ఆయన బంధువులు, సన్నిహితులు తదితరులతో కలిసి.. ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో వినాయుడిని నిమజ్జానికి తీసుకెళ్లారు.

ఈ వినూత్న ఆలోచన.. స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. సైబరాబాద్ సీపీగా ఉన్న సమయంలోనూ ఆయన పలుమార్లు తన ప్రత్యేకత చాటుకున్నారు. వరంగల్ ఎస్పీగా పని చేసిన సమయంలోనూ..అదే విధంగా..దిశ హత్య కేసు ఘటనతో ఒక్కసారిగా ఆయన పేరు మారుమోగింది. ఇక, ఇప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో నిజమజ్జనం కోసం తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కోసం సాగర తీరానికి దగ్గరలోకి చేరుకున్నాడు. నాల్గవ నెంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం జరగనుంది.
గత ఏడాది కరనా కారణంగా నిమజ్జనం లేకపోవటంతో..ఆ సారి పెద్ద సంఖ్యలో ప్రత్యక్షంగా నిమజ్జన సందడి తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. పోలీసులు సైతం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసారు. సాయంత్రానికి పెద్ద సంఖ్యలో విగ్రహాలు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొనే అవకాశం కనిపిస్తోంది. రేపు ఉదయం లోగానే నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే నిమజ్జన నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications