ఓయూ క్యాంపస్ లేడీస్ హాస్టల్లో అలజడి.. అర్ధరాత్రి ఆగంతకుడు హల్చల్..!
హైదరాబాద్ : విద్యా కుసుమాలకు నెలవైన ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆగంతకుడు లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించడం సంచలనం రేకెత్తించింది. ఆ క్రమంలో విద్యార్థినులకు రక్షణ లేకుండా పోయిందనే వాదనలు జోరందుకున్నాయి. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ లోకి ఓ ఆగంతకుడు చొరబడటం చర్చకు దారి తీసింది. సెక్యూరిటీ లోపభూయిష్టంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున 2.30 - 3.00 గంటల ప్రాంతంలో ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్లోకి ఆగంతకుడు వచ్చాడు. వసతి గృహం వెనుక వైపు నుంచి లోపలికి దూకాడు.

అదే సమయంలో ఓ విద్యార్థిని బాత్రూమ్కు వెళ్లారు. ఆగంతకుడు ఉన్నాడనే విషయం ఆమె కనిపెట్టలేకపోయారు. అయితే సదరు విద్యార్థిని బాత్రూమ్కు వెళ్లే క్రమంలో ఆమెను ఫాలో అయ్యాడు. ఆమె బాత్రూమ్కు వెళ్లడంతోనే బయటి నుంచి గొళ్లెం పెట్టేశాడు. అనంతరం బాత్రూమ్ గోడపైకి ఎక్కి లోపలకు దూరాడు.
బాత్రూమ్లో సదరు విద్యార్థినిని కత్తితో బెదిరించాడు. అంతేకాదు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆగంతకుడి తీరుతో మొదట ఆమె భయపడ్డా.. చివరకు ధైర్యం చేసి గట్టిగా కేకలు వేశారు. దాంతో హాస్టల్లో ఉండే కొందరు విద్యార్థినులు అక్కడకు చేరుకున్నారు. వారందర్నీ చూసి భయపడి పరుగు లంకించుకున్నాడు ఆగంతకుడు. అలా పారిపోతూ తన వెంట సదరు విద్యార్థిని మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. అయితే ఆ ఫోన్ తీసుకెళితే తాను పోలీసులకు దొరికిపోతానని భావించాడో ఏమో గానీ హాస్టల్ వెనుకవైపు పారేసి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications