తల్లి కాదు రాక్షసి.. ప్రియుడితో కలిసి కుమారుడి హత్య, అమానుషం..
కలికాలం.. డెవలప్ జరుగుతోన్న.. ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు. కొందరు మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. వివాహేతర సంబంధాలకు అలవాటు పడీ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. పేగు తెంచుకొని జన్మించిన బిడ్డలతో ముర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు హతమార్చి.. మిన్నకుండిపోతున్నారు. భాగ్యనగరంలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. ఓ వివాహిత తన కుమారుడిని కసితీరా కొట్టింది. బాలుడు చనిపోయాక ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ దొంగ ఏడుపు ఏడ్చింది.

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తల్లి కొడుకును తీవ్రంగా కొట్టింది. దీంతో ఆ బాలుడు కన్నుమూశాడు. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. భగత్ సింగ్ నగర్లో నివసిస్తున్న సురేష్, ఉదయ భార్యా భర్తలు ఉండేవారు. వారికి ఉమేష్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఉదయ, భాస్కర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఇక్కడ ట్విస్ట్..

సహజీవనం చేస్తూ..
రెండేళ్ల క్రితం కొడుకును తీసుకుని భర్తతో విడిపోయి భాస్కర్తో కలిసి జీవిస్తోంది. అయితే మంగళవారం ఏం జరిగిందో తెలియలేదు. ఉదయం వేళ కోపంలో ఉన్న ఉదయ కొడుకు ఉమేష్ను తీవ్రంగా కొట్టింది. ఆ దెబ్బలకు బాలుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే బాలుడిని సూరారంలో గల మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఉదయ భర్త సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అడ్డు ఉన్నాడని..
భాస్కర్, ఉదయపెళ్లి చేసుకోవాలని అనుకున్నారని సురేశ్ తెలిపారు. పెళ్లికి తన కుమారుడు అడ్డువస్తున్నాడని చెప్పారు. అందుకోసమే ఇద్దరూ కలిసి కొట్టి హత్య చేశారని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తపై కోపంతోనే ఉదయ.. బాలుడిని కొట్టినట్టు తెలుస్తోంది. సురేశ్ మాత్రం పెళ్లికి అడ్డువస్తున్నాడని కొట్టారని అంటున్నారు. దీనికి సంబంధించి విచారణలో నిజనిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications