హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేఏ పాల్‌తో కలిసి పనిచేస్తా, గద్దర్ ప్రకటన.. మరో 12 మంది కూడా

|
Google Oneindia TeluguNews

ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు నేతల మద్దతు లభిస్తోంది. కలిసి పనిచేసేందుకు నేతలు ముందుకు వస్తున్నాయి. ఆయన నెలకొల్పిన గ్లోబల్‌ హోస్ట్‌ సంస్థతో కలిసి పనిచేస్తామని ప్రజా గాయకుడు గద్దర్‌ ప్రకటించారు. గ్లోబల్‌హోస్ట్‌ కమిటీలో జేడీ లక్ష్మీనారాయణ, జస్టిస్‌ చంద్రకుమార్‌, విమలక్కతోపాటు మరో 12 మంది ఉన్నారని తెలిపారు.

కమిటీలో పనిచేయడానికి అనేకమంది ప్రముఖులు ముందుకువస్తున్నారని ఆయన తెలిపారు. కేవలం ప్రపంచశాంతి, హక్కుల కోసం ఈ సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. సమస్యలపై మాత్రం వర్క్ చేస్తోందని తెలియజేశారు. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

work together with ka paul:gaddar

కేఏ పాల్‌ 59వ పుట్టిన రోజు ఈ నెల 25వ తేదీ అని.. ఆ లోపు మునుగోడు నియోజకవర్గంలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి కోసం స్థలాన్ని కొనుగోలు చేస్తామని అంటున్నారు. ఆసుపత్రిని నిర్మించే యోచనలో కేఏ పాల్‌ ఉన్నారని వెల్లడించారు. ఆ విషయం ప్రజలకు తెలియజేయాలని తనను పాల్‌ ఇక్కడికి పంపించారని గద్దర్ తెలిపారు.

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పాల్ యాక్టివ్ అయ్యారు. సమస్యలపై గళం విప్పుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సదరు పార్టీలకు బుద్ది చెప్పాలని కోరుతున్నారు. ఆ మేరకు జనం నుంచి స్పందన లభిస్తోంది.

English summary
work together with ka paul gaddar said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X